Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Manoj: దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోకు హీరో మంచు మనోజ్ వెంటనే స్పందించారు. సమాధి ప్రాంగణం నిర్లక్ష్యానికి గురై ఉండటాన్ని చూసి తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఈ విషయంపై స్పందించిన మనోజ్.. సమాధిని స్వయంగా శుభ్రం చేయిస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే నేడు ఉదయం 7 గంటలకే తన టీమ్తో కలిసి అక్కడికి చేరుకుని పనులు ప్రారంభించారు.
తన సినిమా షూటింగ్కు వెళ్లే ముందే ప్రత్యేకంగా సమయం కేటాయించిన మనోజ్.. సమాధి పరిసరాల్లో పేరుకుపోయిన ఎండుటాకులు, చెత్తాచెదారాన్ని స్వయంగా శుభ్రం చేశారు. ఆయనతో పాటు టీమ్ సభ్యులు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల ఓ యాంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో దాసరి సమాధి దయనీయ పరిస్థితి బయటపడింది. ఆ వీడియో చూసిన వెంటనే స్పందించిన మనోజ్.. తెలుగు సినీ పరిశ్రమకు అపార సేవలందించిన మహానుభావుడి సమాధి ఇలా ఉండటం బాధ కలిగించిందన్నారు.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
మంచు మనోజ్, మౌనిక భూమా మంచు ఇటీవల ప్రారంభించిన “ఐక్య ధైర్య సేన” సమితి సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈ చర్య తక్షణ చర్య చేపట్టారు మనోజ్. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు ఇదివరకే వెల్లడించారు. హీరో మనోజ్ చేసిన ఈ పనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!