NTV Telugu Site icon

Chennai: 28 ఏళ్ల క్రితం హత్య.. నిందితుడు అరెస్ట్

Chennai Police

Chennai Police

చెన్నైలో 28 ఏళ్ల క్రితం భార్య విడాకుల ఫిర్యాదుతో అత్తను హతమార్చిన వ్యక్తిని బెర్హంపూర్ రైల్వే స్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు చాలారోజులుగా వెతుకుతుండగా.. మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు హరిహర్ పట్టాజోషి (51) కోసం వారం రోజులపాటు నిఘా ఉంచి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. గోసానినుగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడు దాక్కున్నట్లు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నట్లు బెర్హంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) వివేక్ ఎం శరవణ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. 1994లో చెన్నైలోని ఓ అడ్వర్టైజింగ్‌ కంపెనీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తున్న పట్టాజోషి.. మరో కంపెనీలో టెలిమార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల ఇందిరతో ప్రేమలో పడ్డాడు. అనంతరం జూలై 1994లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే వారిద్దరూ విడివిడిగా జీవించడం ప్రారంభించి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Read Also: Mohan Yadav: యూపీ సీఎంను ఫాలో అవుతున్న మధ్యప్రదేశ్ సీఎం.. బుల్డోజర్కు పనిచెప్పిన మోహన్ యాదవ్

కాగా.. 1995 ఆగస్టు 9న చెన్నైలోని నంగనల్లూర్ నివాసంలో పట్టజోషి తన భార్య, బావ కార్తీక్, అత్త రమ(48)పై కత్తితో దాడి చేశాడు. దాడిలో రమడు మృతి చెందగా, అతని భార్య, బావ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆదంబాక్కం పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. దీంతో పట్టజోషి చెన్నైకి పారిపోయాడు. అనంతరం.. ఒడిశా, సూరత్‌లోని వివిధ ప్రదేశాలలో తలదాచుకున్నాడు. మొదట నిందితుడు అస్కాలోని స్నేహితుడి ఇంట్లో దాక్కున్నాడు. అక్కడ అతను మరొక మహిళను కలుసుకుని.. 2001 లో ఆమెను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి.. బెర్హంపూర్‌లోని ఒక సుగంధ ద్రవ్యాల కర్మాగారంలో, తర్వాత కేంద్రపరాలోని బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీలో సేల్స్‌మెన్‌గా, బెర్హంపూర్‌లోని చెకింగ్ ఫండ్ కంపెనీకి మేనేజర్‌గా పనిచేశాడు. అయితే.. గత 28 సంవత్సరాలుగా పోలీసు బృందాలు బెర్హంపూర్ మరియు సమీప ప్రాంతాలలో దాడులు నిర్వహించినప్పటికీ.. నిందితుడు ఇల్లు, ఉద్యోగం మారడం వల్ల అతన్ని అరెస్టు చేయలేకపోయారు.

Read Also: MP Derek O’Brien: ‘పార్లమెంట్ చీకటి గదిగా మారింది’.. కేంద్రంపై తీవ్ర విమర్శలు

అయితే.. వారం రోజుల క్రితం చెన్నైలోని ఆదంబాక్కం పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల పోలీసు బృందం బెర్హంపూర్ పోలీసులను ఆశ్రయించింది. గోసానినుగావ్ ఇన్‌స్పెక్టర్ స్మృతి నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందం సమన్వయంతో పనిచేసి అన్ని అనుమానాస్పద ప్రదేశాలలో నిఘా ఉంచి ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు.