Kolkata Protest: SIR కు వ్యతిరేకంగా సీఎం భారీ ర్యాలీ..
- కోల్కతా వీధుల్లో మమతా బెనర్జీ నిరసన ర్యాలీ
- బీజేపీ ఒక దోపిడీ పార్టీ అంటూ విమర్శలు
- 3.8 కిలో మీటర్ల పాదయాత్ర చేసిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Protest: కోల్కతా వీధుల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ప్రజలు పాల్గొన్నారు. ఈ సవరణ డ్రైవ్ అనేది ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వహించే “నిశ్శబ్ద, అదృశ్య రిగ్గింగ్” అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
READ ALSO: DMF Awards : గ్రాండ్ గా భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
Also Read
- Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
- Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
- Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
- Harish Rao: "నీకు మా రక్తం కావాలా".. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
మమతా బెనర్జీ ఏం అన్నారంటే..
ర్యాలీ అనంతరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ “చాలా మంది అసంఘటిత రంగ కార్మికులు తమ పేర్లను తొలగిస్తారా అని ఆలోచిస్తున్నారు. బంగ్లాలో మాట్లాడటం అంటే బంగ్లాదేశీ అని కాదు, హిందీ లేదా పంజాబీలో మాట్లాడటం అంటే పాకిస్థానీ అని అర్థం కాదు. బంగ్లాలో మాట్లాడే వారిని బంగ్లాదేశీ అని ముద్ర వేస్తున్నారు, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనని ఈ మూర్ఖులు. ఆ సమయంలో బీజేపీ ఎక్కడ ఉంది? అందుకే స్వాతంత్ర్యానికి ముందు భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఒకే భూమిలో భాగమని వారికి తెలియదు ” అని వెల్లడించారు. “బీజేపీ ఒక దోపిడీ పార్టీ. వారు అనేక ఏజెన్సీలను ఉపయోగించుకున్నారు, నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. కానీ భవిష్యత్తులో వాళ్లు అధికారంలో ఉండరు” అని అన్నారు.
మమతా బెనర్జీ తన మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో కలిసి నగరం నడిబొడ్డున వేలాది మంది మద్దతుదారులతో కలిసి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నిరసన ర్యాలీని రెడ్ రోడ్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభించి 3.8 కిలోమీటర్ల మేర నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో టీఎంసీ కార్యకర్తలు, సానుభూతిపరులు పార్టీ జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ, SIR వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. SIR ప్రక్రియ చుట్టూ ఉన్న భయం ఇప్పటికే అనేక మంది ప్రాణాలను బలిగొందని అన్నారు. “గత ఏడు రోజుల్లో SIR భయం కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులు నేటి ర్యాలీలో మాతో ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు వ్యక్తులు తమ ఓటు హక్కులు హరించబడతాయని భయపడ్డారు” అని ఆయన చెప్పారు.
READ ALSO: Bilaspur Train Accident: భయంకరమైన రైలు ప్రమాదం .. ఆరుగురు మృతి
తాజావార్తలు
-
Crispy Poori Recipe: పూరీలు వెంటనే అణిగిపోతున్నాయా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గంటల తరబడి ఉబ్బి కరకరలాడతాయి
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
-
Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
-
Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..