Kolkata Protest: SIR కు వ్యతిరేకంగా సీఎం భారీ ర్యాలీ..
- కోల్కతా వీధుల్లో మమతా బెనర్జీ నిరసన ర్యాలీ
- బీజేపీ ఒక దోపిడీ పార్టీ అంటూ విమర్శలు
- 3.8 కిలో మీటర్ల పాదయాత్ర చేసిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Protest: కోల్కతా వీధుల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ప్రజలు పాల్గొన్నారు. ఈ సవరణ డ్రైవ్ అనేది ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వహించే “నిశ్శబ్ద, అదృశ్య రిగ్గింగ్” అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
READ ALSO: DMF Awards : గ్రాండ్ గా భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
Also Read
- Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
- CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
- Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
మమతా బెనర్జీ ఏం అన్నారంటే..
ర్యాలీ అనంతరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ “చాలా మంది అసంఘటిత రంగ కార్మికులు తమ పేర్లను తొలగిస్తారా అని ఆలోచిస్తున్నారు. బంగ్లాలో మాట్లాడటం అంటే బంగ్లాదేశీ అని కాదు, హిందీ లేదా పంజాబీలో మాట్లాడటం అంటే పాకిస్థానీ అని అర్థం కాదు. బంగ్లాలో మాట్లాడే వారిని బంగ్లాదేశీ అని ముద్ర వేస్తున్నారు, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనని ఈ మూర్ఖులు. ఆ సమయంలో బీజేపీ ఎక్కడ ఉంది? అందుకే స్వాతంత్ర్యానికి ముందు భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఒకే భూమిలో భాగమని వారికి తెలియదు ” అని వెల్లడించారు. “బీజేపీ ఒక దోపిడీ పార్టీ. వారు అనేక ఏజెన్సీలను ఉపయోగించుకున్నారు, నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. కానీ భవిష్యత్తులో వాళ్లు అధికారంలో ఉండరు” అని అన్నారు.
మమతా బెనర్జీ తన మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో కలిసి నగరం నడిబొడ్డున వేలాది మంది మద్దతుదారులతో కలిసి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నిరసన ర్యాలీని రెడ్ రోడ్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభించి 3.8 కిలోమీటర్ల మేర నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో టీఎంసీ కార్యకర్తలు, సానుభూతిపరులు పార్టీ జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ, SIR వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. SIR ప్రక్రియ చుట్టూ ఉన్న భయం ఇప్పటికే అనేక మంది ప్రాణాలను బలిగొందని అన్నారు. “గత ఏడు రోజుల్లో SIR భయం కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులు నేటి ర్యాలీలో మాతో ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు వ్యక్తులు తమ ఓటు హక్కులు హరించబడతాయని భయపడ్డారు” అని ఆయన చెప్పారు.
READ ALSO: Bilaspur Train Accident: భయంకరమైన రైలు ప్రమాదం .. ఆరుగురు మృతి
తాజావార్తలు
-
Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!