Kolkata Protest: SIR కు వ్యతిరేకంగా సీఎం భారీ ర్యాలీ..
- కోల్కతా వీధుల్లో మమతా బెనర్జీ నిరసన ర్యాలీ
- బీజేపీ ఒక దోపిడీ పార్టీ అంటూ విమర్శలు
- 3.8 కిలో మీటర్ల పాదయాత్ర చేసిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Protest: కోల్కతా వీధుల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ప్రజలు పాల్గొన్నారు. ఈ సవరణ డ్రైవ్ అనేది ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వహించే “నిశ్శబ్ద, అదృశ్య రిగ్గింగ్” అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
READ ALSO: DMF Awards : గ్రాండ్ గా భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
మమతా బెనర్జీ ఏం అన్నారంటే..
ర్యాలీ అనంతరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ “చాలా మంది అసంఘటిత రంగ కార్మికులు తమ పేర్లను తొలగిస్తారా అని ఆలోచిస్తున్నారు. బంగ్లాలో మాట్లాడటం అంటే బంగ్లాదేశీ అని కాదు, హిందీ లేదా పంజాబీలో మాట్లాడటం అంటే పాకిస్థానీ అని అర్థం కాదు. బంగ్లాలో మాట్లాడే వారిని బంగ్లాదేశీ అని ముద్ర వేస్తున్నారు, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనని ఈ మూర్ఖులు. ఆ సమయంలో బీజేపీ ఎక్కడ ఉంది? అందుకే స్వాతంత్ర్యానికి ముందు భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఒకే భూమిలో భాగమని వారికి తెలియదు ” అని వెల్లడించారు. “బీజేపీ ఒక దోపిడీ పార్టీ. వారు అనేక ఏజెన్సీలను ఉపయోగించుకున్నారు, నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. కానీ భవిష్యత్తులో వాళ్లు అధికారంలో ఉండరు” అని అన్నారు.
మమతా బెనర్జీ తన మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో కలిసి నగరం నడిబొడ్డున వేలాది మంది మద్దతుదారులతో కలిసి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నిరసన ర్యాలీని రెడ్ రోడ్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభించి 3.8 కిలోమీటర్ల మేర నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో టీఎంసీ కార్యకర్తలు, సానుభూతిపరులు పార్టీ జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ, SIR వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. SIR ప్రక్రియ చుట్టూ ఉన్న భయం ఇప్పటికే అనేక మంది ప్రాణాలను బలిగొందని అన్నారు. “గత ఏడు రోజుల్లో SIR భయం కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులు నేటి ర్యాలీలో మాతో ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు వ్యక్తులు తమ ఓటు హక్కులు హరించబడతాయని భయపడ్డారు” అని ఆయన చెప్పారు.
READ ALSO: Bilaspur Train Accident: భయంకరమైన రైలు ప్రమాదం .. ఆరుగురు మృతి
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!