Site icon NTV Telugu

India-China: భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై కొనసాగుతున్న చర్చలు

India China

India China

India-China: భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల సైన్యాల మధ్య మూడో రౌండ్ మేజర్ జనరల్ స్థాయి చర్చలు దౌలత్ బేగ్ ఓల్డి (DBO) సెక్టార్‌తో పాటు చుషుల్‌లో కొనసాగుతున్నాయి. ఆగస్టు 18న ప్రారంభమైన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని రక్షణ శాఖ సీనియర్ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 13-14 తేదీల్లో ఇరుపక్షాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. ఈ సంభాషణ ఫలితంగా ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య సమావేశానికి ముందు మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి. రెండు చోట్లా ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. దేప్సాంగ్ పాయింట్, సీఎన్‌ఎన్‌ జంక్షన్ వద్ద సరిహద్దు సమస్యలకు పరిష్కారం కోసం భారతదేశం వెతుకుతోంది. ఈ రెండు చోట్ల జరుగుతున్న చర్చల్లో భారత్ తరఫున త్రిశూల్ డివిజన్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ జనరల్ పీకే మిశ్రా, యూనిఫాం ఫోర్స్ కమాండింగ్ మేజర్ జనరల్ హరిహరన్ హాజరవుతున్నారు.

Read  Also : Heart Surgery: ప్రాణాలు కాపాడటానికి కొద్దిసేపు చంపేశారు.. ప్రభుత్వ హాస్పిటల్‌లో అరుదైన ఆపరేషన్‌

గత మూడున్నర సంవత్సరాలుగా భారతదేశం, చైనా మధ్య సరిహద్దులో ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. దానిని పరిష్కరించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సైనిక చర్చలు కూడా ఈ ప్రయత్నంలో భాగమే. 19వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు ముగిసిన ఒక రోజు తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని, సైనిక మరియు దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. శాంతిని కొనసాగించడానికి కూడా అంగీకరించాయి.

బ్రిక్స్ సదస్సులో భేటీ కానున్న మోదీ, జిన్‌పింగ్‌

బ్రిక్స్ (బ్రెజిల్-రష్యా-భారత్-చైనా-సౌత్) సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే ముందు ఈ సైనిక చర్చలు జరిగాయి. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా పాల్గొననున్నారు. ఇరు దేశాల అధినేతల మధ్య సమావేశం కూడా జరగనుంది. సరిహద్దు సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని, సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చల వేగాన్ని కొనసాగించేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయని అంతకుముందు ప్రకటనలో పేర్కొన్నారు.

Read  Also : Pak Smugglers: పంజాబ్‌లో ఇద్దరు పాక్ స్మగ్లర్లు అరెస్ట్.. భారీగా హెరాయిన్‌ స్వాధీనం

తూర్పు లడఖ్‌లోని కొన్ని చోట్ల భారత్, చైనా సైనికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విస్తృత దౌత్య మరియు సైనిక చర్చల తర్వాత ఇరుపక్షాలు అనేక ప్రాంతాల నుండి దళాల ఉపసంహరణను పూర్తి చేశాయి. చర్చల్లో చైనా జట్టుకు దక్షిణ జిన్‌జియాంగ్ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ నాయకత్వం వహించగా.. భారత ప్రతినిధి బృందానికి లెహ్-హెడ్‌క్వార్టర్డ్ 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి నాయకత్వం వహించారు. ఏప్రిల్ 23న జరిగిన 18వ రౌండ్ సైనిక చర్చల్లో, దేప్‌సాంగ్, డెమ్‌చోక్‌లలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని భారతదేశం వాదించింది. జులై 24న జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశం సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్ యీని కలిశారు. 2020 నుంచి భారత్‌-చైనా సరిహద్దులోని పశ్చిమ సెక్టార్‌లోని ఎల్‌ఏసీ వద్ద పరిస్థితి ప్రజా సంబంధాలు, రాజకీయ ప్రాతిపదికను నాశనం చేసిందని దోవల్ ఎత్తి చూపారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మే 5, 2020న పాంగోంగ్ లేక్ ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత తూర్పు లడఖ్ సరిహద్దులో ప్రతిష్టంభన ఏర్పడింది. జూన్ 2020లో గాల్వన్ వ్యాలీలో జరిగిన భీకర ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సైనిక, దౌత్యపరమైన చర్చల కారణంగా, పాంగోంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డున.. గోగ్రా ప్రాంతంలో 2021లో రెండు పక్షాలు దళాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేశాయి.

Exit mobile version