Mahindra OJA: నాలుగు చక్రాలతో నడిచే తేలికపాటి ట్రాక్టర్లను ఆవిష్కరించిన మహీంద్రా గ్రూప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra OJA: భారతదేశం ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత దేశమే. మనదేశ వ్యవసాయంలో ట్రాక్టర్లు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఇక దేశీయంగా ట్రాక్టర్ల వ్యాపారంలో మహీంద్రా గ్రూప్ పెద్దది. ఎంతో నాణ్యమైన ట్రాక్టర్లను అందించడంలో మహీంద్ర గ్రూప్ ముందుంటుంది. నమ్మకానికి మారు పేరు ఈ బ్రాండ్. గట్టిగా, కఠినంగా ఉండే వ్యవసాయం క్షేత్రాల్లో సైతం ఈ ట్రాకర్లు మెరుగైన పనితీరుని కనబరుస్తాయి. ఈ ట్రాక్టర్లు ఉత్తమంగా పనిచేస్తామని ఎంతో మంది రైతన్నలు సైతం చెబుతూ ఉంటారు. ఇక తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం రోజు మహీంద్రా గ్రూప్ అతి పెద్ద ప్రకటన చేసింది. ‘ఫ్యూచర్-రెడీ’ ట్రాక్టర్ల శ్రేణిని ఆవిష్కరించింది. వీటికి మహీంద్రా ఓజా అని పేరుపెట్టింది. ఈ కార్యక్రమం దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్లో జరిగింది.
ఈ ట్రాక్టర్లలో చాలా విశేషాలు ఉన్నాయి. ఇవి నాలుగు చక్రాలతో నడిచే లైట్ వెయిట్ ట్రాక్టర్లు. దీనిని ట్రాక్టర్ టెక్నాలజీలోనే నూతన ఆవిష్కరణగా పేర్కొనవచ్చు. డిజైన్ & ఇంజనీరింగ్లో ట్రాన్స్ఫార్మేటివ్ మార్పును తీసుకొస్తూ 4WD స్టాండర్డ్తో 7 కొత్త ట్రాక్టర్ల మోడళ్లను విడుదల చేసింది మహీంద్ర గ్రూప్. కాంపాక్ట్ , స్మాల్ యుటిలిటీ ప్లాట్ఫారమ్లలో భారత మార్కెట్ కోసం వీటిని రూపొందించింది. రైతులు ఎక్కువ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కొత్త OJA ట్రాక్టర్ల శ్రేణిని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు మహీంద్రా & మహీంద్రా ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా వెల్లడించారు. ఈ ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందన్నారు.
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
Also Read: Adani: అదానీ గ్రూపులో చేరిన ఆ మీడియా సంస్థ.. పూర్తిగా కొనుగోలు
వీటి ఎక్స్షోరూమ్ ప్రారంభ ధర రూ.5.64 లక్షల నుంచి ఉంటుందని వెల్లడించారు. త్వరలోనే వీటిని ప్రపంచ వ్యాప్తంగా వివిధ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ ప్రకటించింది. PROJA, MYOJA, ROBOJA అనే మూడు అడ్వాన్స్ టెక్నాలజీలతో లైట్ ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చింది కంపెనీ. ఈ మోడల్లు 20HP-40HP పవర్ కలిగి ఉంటాయి. ఏషియన్, యూరోపియన్ మార్కెట్లలోకి అడుగుపెట్టేందుకు ఇవి కంపెనీకి ఉపయోగపడతాయని మెుబిలిటీ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.కొత్త మోడల్ ట్రాక్టర్లు ప్రపంచంలో పావు వంతు అంటే 25 శాతం మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
And here’s the Mahindra Tractors OJA range pic.twitter.com/th0FvyXjs4
— Sirish Chandran (@SirishChandran) August 15, 2023
తాజావార్తలు
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!