టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో మహేష్ బాబుకు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అయ్యింది.. అయితే కొన్ని కారణాల వల్ల షూటింగ్ వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తుంది..
ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రారంభమైంది. ఇటీవలె ఈ చిత్రానికి `గుంటూరు కారం’ టైటిల్ ను లాక్ చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు..సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్బంగా సినిమా నుంచి వచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ తెగ ఆకట్టుకుంది.. ఇక ఇదే సమయంలో గుంటూరు కారంకు సంబంధించి ఓ షాకింగ్ వార్త నెట్టింట వైరల్ గా మారింది… అదేంటంటే.. ఈ సినిమా గురించి ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసింది..
ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఈ సినిమాను రిజెక్ట్ చేశారని, ఆ తర్వాత మహేష్ దగ్గరకు వెళ్లిందని టాక్.. ఇంతకీ గుంటూరు కారంను రిజెక్ట్ చేసిన ఆ హీరో మరెవరో కాదండోయ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అట..దాన్ని మహేష్ వినిపించడం తో ఓకే చేశారని టాక్.. ఇక ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ ఓ కథను కూడా వినిపించాడట. కానీ, ఆ కథ ఎన్టీఆర్ ను మెప్పించలేకపోయింది. అదే సమయంలో కొరటాల శివ చెప్పిన కథ నచ్చడంతో.. ఎన్టీఆర్ వెంటనే ఆయనకు ఓకే చేసాడట..వీరిద్దరి కలయికలో ప్రస్తుతం `దేవర మూవీ తెరకెక్కుతోంది. ఇక ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతోనే త్రివిక్రమ్ మహేష్ బాబుకు చెప్పి.. సినిమాకు ఒప్పించాడని ప్రచారం జరుగుతోంది.. ఇందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది..