Loksabha Elections : ఐదో దశ ఓటింగ్ తుది గణాంకాలు వెల్లడి.. ఎంత ఓటింగ్ జరిగిందో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Loksabha Elections : లోక్సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్కు సంబంధించిన తుది గణాంకాలు వెలువడ్డాయి. మంగళవారం రాత్రి ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఐదవ దశలో సుమారు 62.19 శాతం ఓటింగ్ జరిగింది. ఇది 2019తో పోలిస్తే 1.97 శాతం తక్కువ. సోమవారం సాయంత్రం ఐదో దశ ఓటింగ్ ముగియడంతో 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 428 నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఇప్పుడు దేశంలో మరో రెండు దశల ఎన్నికలు మిగిలి ఉన్నాయి.
2019 ఎన్నికల్లో ఐదో దశలో ఏడు రాష్ట్రాల్లోని 51 స్థానాలకు పోలింగ్ జరగగా, 64.16 శాతం ఓటింగ్ నమోదైంది. నాల్గవ దశలో ఓటింగ్ శాతం 69.16 శాతం ఉంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల అదే దశ కంటే 3.65 శాతం ఎక్కువ. మూడవ దశ ఎన్నికల్లో 65.68 శాతం ఓటింగ్ జరిగింది. ఇది 2019తో పోలిస్తే దాదాపు ఒక శాతం తక్కువ. 2019 లోక్సభ ఎన్నికల మూడో విడతలో 68.4 ఓట్లు పోలయ్యాయి. ఈ సంవత్సరం రెండవ దశలో 66.71 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది గత సారితో పోలిస్తే 1 శాతం కంటే కొంచెం తక్కువ. 2019లో రెండో దశలో 69.64 శాతం ఓటింగ్ జరిగింది.
Also Read
- Su-57E Stealth Fighter: భారత్కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్కు చెక్..
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
Read Also:Rave Party: అది రేవ్ పార్టీ కాదు.. జరిగింది ఇదే.. వీడియో రిలీజ్ చేసిన నటి!
తొలి దశలోనే ఇంత ఓటింగ్
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తొలి దశలో 66.14 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో.. మొదటి దశలో 69.43 శాతం ఓటింగ్ జరిగింది. ఓటింగ్ గణాంకాలకు సంబంధించి.. ఓటింగ్ శాతం తుది గణాంకాలు ఫలితాల తర్వాత మాత్రమే అందుబాటులో ఉంటాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఓట్ల లెక్కింపు పూర్తయితే పరిస్థితి మరింత తేటతెల్లమవుతుంది.
మిగిలి ఉన్న రెండు దశల ఎన్నికలు
దేశంలో ఇంకా రెండు దశల్లో ఆరు, ఏడో దశల్లో ఓటింగ్ జరగాల్సి ఉంది. ఆరో దశకు మే 25న, చివరి దశకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం, రాజధాని ఢిల్లీతో పాటు హర్యానా, పంజాబ్, యూపీ, పశ్చిమ బెంగాల్తో సహా పలు రాష్ట్రాల్లో కొన్ని స్థానాల్లో ఓటింగ్ పెండింగ్లో ఉంది. జూన్ 1న చివరి రౌండ్ ఓటింగ్ ముగియగా, జూన్ 4న ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి.
Read Also:Rahul Tripathi: రనౌట్ అయిన తర్వాత మెట్లపై కూర్చొని ఎలా బాధపడుతున్నాడో చూడండి..
తాజావార్తలు
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!