Odisha : ఒడిశాలో భారీగా లిథియం నిల్వలు.. నయాగఢ్ లో లభించిన ఆధారాలు.. దేశం దశ తిరిగేనా ?
- ఒడిశాలో భారీ మొత్తంలో లిథియం నిల్వలు
- ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లకు మార్గం సుగమం
- ఖనిజ నిక్షేపాలను సర్వే చేస్తున్న జి.ఎస్.ఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha : ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో లిథియం నిల్వలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ సమాచారాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) సీనియర్ అధికారి ఆదివారం ఇచ్చారు. ఒడిశాలో లిథియం దొరికితే రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అవుతుందని ఆయన అన్నారు. లిథియం అనేది సీసం, అల్యూమినియం ఉత్పత్తులు, బ్యాటరీల ఉత్పత్తిలో విస్తృతంగా ఉపయోగించే లోహం.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ ప్రస్తుతం అంత పెద్ద ఆవిష్కరణ జరుగలేదు. కానీ లిథియం ఉనికికి సంబంధించిన కొన్ని సూచనలు కనుగొనబడ్డాయి. మనం ఇంకా చాలా ప్రారంభ దశలోనే ఉన్నాము. కాబట్టి మనం ఎటువంటి వాదనలు ఇప్పటికైతే చేయకూడదు. అయితే, భౌగోళికంగా చెప్పాలంటే నయాగఢ్ లాగా తూర్పు కనుమల ప్రాంతంలో కొన్ని సూచనలు కనుగొన్నాము. గతంలో కర్ణాటక, జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలలో లిథియం కనుగొన్నారు’’ అని చెప్పారు.
Also Read
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
Read Also:Daredevils: కర్తవ్యపథ్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఇండియన్ ఆర్మీ డేర్డెవిల్స్
ఒడిశా మైనింగ్ కార్యకలాపాలు దేశానికే ఒక నమూనా
సోమవారం నుండి కోణార్క్లో ప్రారంభమయ్యే రెండు రోజుల జాతీయ గనుల మంత్రుల సమావేశంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) డిప్యూటీ జనరల్ పంకజ్ కుమార్ మాట్లాడారు. ఇదిలా ఉండగా కేంద్ర గనుల కార్యదర్శి వి.ఎల్. కాంతారావు విలేకరులతో మాట్లాడుతూ.. డ్రోన్ల వాడకంతో సహా వివిధ పద్ధతుల ద్వారా ఒడిశాలోని ఖనిజ నిక్షేపాలను జి.ఎస్.ఐ సర్వే చేస్తోందని అన్నారు. దీని కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) డ్రోన్లతో పాటు ఏఐని ఉపయోగించడం ప్రారంభించింది.
‘డ్రోన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాల వాడకంతో ఇప్పుడు పరిస్థితులు సులభతరం, వేగవంతం అవుతున్నాయి’ అని ఆయన అన్నారు. భారతదేశంలో పైలట్ ప్రాతిపదికన రెండు ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి. ఒకటి రాజస్థాన్లో, మరొకటి ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్నాయి. చాలా ఏళ్లుగా మైనింగ్ పనులు ఆగిపోయిన జిల్లాల్లో ఖనిజ సర్వే కార్యకలాపాలను కూడా ముమ్మరం చేస్తామని రావు చెప్పారు. ఒడిశాలో మైనింగ్ కార్యకలాపాలు యావత్ దేశానికే ఒక నమూనాగా మారాయి.
Read Also:Land Grabbing: మా ల్యాండ్ కబ్జా చేశారు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై హైడ్రాలో ఫిర్యాదు!
CGPI 64వ సమావేశంలో ఏమన్నారంటే ?
దేశంలోని ఖనిజాలలో ఒడిశా దాదాపు 50 శాతం వాటాను కలిగి ఉన్నందున గనుల మంత్రుల సమావేశం అత్యంత ముఖ్యమైనదని విఎల్ కాంతారావు అన్నారు. సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డ్ (CGPI) 64వ సమావేశంలో ప్రసంగిస్తూ, సహకారాన్ని ప్రోత్సహించడంలో.. భూగర్భ శాస్త్రాన్ని అభివృద్ధి చేయడంలో వేదిక ముఖ్యమైన పాత్రను కాంతా రావు నొక్కి చెప్పారు. కేంద్ర గనుల కార్యదర్శి వి.ఎల్. కాంతారావు బోర్డుకు చైర్మన్ కూడా వ్యవహరిస్తున్నారు.
‘క్రిటికల్ మినరల్ మిషన్’, ఆఫ్షోర్ మైనింగ్పై ఇటీవల జరిగిన రెండు ముఖ్యమైన బడ్జెట్ ప్రకటనలకు అనుగుణంగా గనుల మంత్రిత్వ శాఖ కీలక కార్యక్రమాలను కూడా ఆయన హైలైట్ చేశారు. 2024-25లో ఇప్పటివరకు 24 కీలకమైన ఖనిజ బ్లాకుల వేలం విజయవంతంగా జరిగిందని కాంతారావు తెలిపారు. పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయడానికి NMET నిధులను ఉపయోగించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
Nithiin: ఫ్లాప్ల తర్వాత ఫుల్ ఫోకస్.. వరుసగా మూడు సినిమాలతో భారీ కమ్బ్యాక్కు సిద్ధమైన నితిన్!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!