యంగ్ హీరో వరుణ్ తేజ్ భార్య, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియా వేధింపులకు గురయింది. కొందరు ఆకతాయిల సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అసభ్యకర మెసేజులు, దూషణలు వస్తున్నట్లు తెలిపింది లావణ్య. ఇన్స్టాగ్రామ్లో “పర్పుల్ క్రేయాన్00” అనే ఖాతా నుంచి లావణ్యకు అశ్లీల, అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడు ఓ ఆగంతకుడు. ఈ చర్యలతో మనస్తాపానికి గురైంది లావణ్య. ఈ వేధింపులపై హైదరాబాద్ CCS పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Also Read : Surendhar Reddy : పవన్ కళ్యాణ్ సినిమాతో సురేందర్ రెడ్డి కంబ్యాక్ ఇస్తారా?
ఇన్స్టాగ్రామ్లో తనను వేధిస్తున్న పోకిరి అకౌంట్ వివరాలతో పాటు అతను పంపిన అశ్లీల సందేశాలును పోలీసులుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంటూ సదరు వ్యక్తిపై చర్యలు తెసుకోవాలని కోరింది. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఇచ్చిన అకౌంట్ వివరాల ఆధారంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా అకౌంట్స్ను ట్రాక్ చేసి, బాధితుడిని పీడించే వ్యక్తులను గుర్తించడం పోలీసుల ప్రధాన లక్ష్యం అని అధికారులు చెప్పారు. ఈ ఘటన సోషల్ మీడియాలో సరైన నియంత్రణల అవసరాన్ని గుర్తుచేస్తోంది. నటి లావణ్య త్రిపాఠి కోసం త్వరగా న్యాయం మరియు రక్షణ కల్పించడం కోసం పోలీసులు చర్యలు చేపట్టుతున్నారు
