China : చైనాలో కొండచరియలు విరిగిపడి.. 8 మంది మృతి, 39 మంది గల్లంతు
China : నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్లో సోమవారం కొండచరియలు విరిగిపడటంతో కనీసం ఎనిమిది మంది మృతి చెందగా, మరో 39 మంది గల్లంతయ్యారు. బీజింగ్ కాలమానం ప్రకారం ఉదయం 5:51 గంటలకు జాటోంగ్ నగరంలోని లియాంగ్షుయ్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది చనిపోయారని, మరో 39 మంది గల్లంతయ్యారని నిర్ధారించారు. 18 ఇళ్లలో నివసిస్తున్న 47 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని రెస్క్యూ అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల నుంచి 500 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డిజాస్టర్ మిటిగేషన్ కోసం ప్రొవిన్షియల్ కమీషన్ ఉపశమనం కోసం మూడవ స్థాయి ప్రతిస్పందనను సక్రియం చేసింది.
Read Also:Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read
- 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
కొండచరియలు విరిగిపడిన తరువాత శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లో 200 మందికి పైగా రెస్క్యూ వర్కర్లతో పాటు 33 అగ్నిమాపక వాహనాలు, 10 లోడింగ్ మిషన్లు తప్పిపోయిన వ్యక్తుల కోసం వెతకడానికి మోహరించారు. కొండచరియలు విరిగి పడి గల్లంతైన వారి కోసం వెతకాలని, అన్ని రకాల సహాయక చర్యలను చేపట్టాలని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆదేశించారు. తక్షణమే రెస్క్యూ టీమ్లను మోహరించాలని, తప్పిపోయిన వ్యక్తుల కోసం వెతకడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని.. వీలైనంత వరకు, ప్రాణనష్టం సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నిస్తామని జిన్పింగ్ చెప్పారు.
Read Also:Earthquake in Delhi: ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్లో భూకంపం.. చైనాలో భూకంప కేంద్రం
చైనా ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ లియాంగ్షుయ్లో సాధ్యమైన అన్ని రెస్క్యూ ప్రయత్నాలను కూడా ఆదేశించారు. ప్రాంతం, ఎత్తు, జాతి వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని సామాజిక స్థిరత్వాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుతం కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నగరంలో ఈరోజు తేలికపాటి మంచు కురుస్తుందని, కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ మూడు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండవచ్చని స్థానిక వాతావరణ సూచన చెబుతోంది.
తాజావార్తలు
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
-
Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!