China : చైనాలో కొండచరియలు విరిగిపడి.. 8 మంది మృతి, 39 మంది గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China : నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్లో సోమవారం కొండచరియలు విరిగిపడటంతో కనీసం ఎనిమిది మంది మృతి చెందగా, మరో 39 మంది గల్లంతయ్యారు. బీజింగ్ కాలమానం ప్రకారం ఉదయం 5:51 గంటలకు జాటోంగ్ నగరంలోని లియాంగ్షుయ్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది చనిపోయారని, మరో 39 మంది గల్లంతయ్యారని నిర్ధారించారు. 18 ఇళ్లలో నివసిస్తున్న 47 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని రెస్క్యూ అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల నుంచి 500 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డిజాస్టర్ మిటిగేషన్ కోసం ప్రొవిన్షియల్ కమీషన్ ఉపశమనం కోసం మూడవ స్థాయి ప్రతిస్పందనను సక్రియం చేసింది.
Read Also:Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read
- Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
- Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
- FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
- Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
కొండచరియలు విరిగిపడిన తరువాత శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లో 200 మందికి పైగా రెస్క్యూ వర్కర్లతో పాటు 33 అగ్నిమాపక వాహనాలు, 10 లోడింగ్ మిషన్లు తప్పిపోయిన వ్యక్తుల కోసం వెతకడానికి మోహరించారు. కొండచరియలు విరిగి పడి గల్లంతైన వారి కోసం వెతకాలని, అన్ని రకాల సహాయక చర్యలను చేపట్టాలని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆదేశించారు. తక్షణమే రెస్క్యూ టీమ్లను మోహరించాలని, తప్పిపోయిన వ్యక్తుల కోసం వెతకడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని.. వీలైనంత వరకు, ప్రాణనష్టం సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నిస్తామని జిన్పింగ్ చెప్పారు.
Read Also:Earthquake in Delhi: ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్లో భూకంపం.. చైనాలో భూకంప కేంద్రం
చైనా ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ లియాంగ్షుయ్లో సాధ్యమైన అన్ని రెస్క్యూ ప్రయత్నాలను కూడా ఆదేశించారు. ప్రాంతం, ఎత్తు, జాతి వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని సామాజిక స్థిరత్వాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుతం కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నగరంలో ఈరోజు తేలికపాటి మంచు కురుస్తుందని, కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ మూడు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండవచ్చని స్థానిక వాతావరణ సూచన చెబుతోంది.
తాజావార్తలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
-
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!