Amit Shah: 2024 సార్వత్రిక ఎన్నికల్లో లాలూ-నితీష్ ద్వయం తుడిచిపెట్టుకుపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: బిహార్లోని పూర్నియాలో జరిగిన మెగా ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బిహార్లో బీజేపీ సోలో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పేరిట ఆయన సమర్థవంతంగా ప్రారంభించారు. జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు బీజేపీకి ద్రోహం చేశారంటూ బీజేపీతో తెగతెంపులు చేసుకున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై కేంద్ర హోంమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమిత్ షా ప్రస్తుతం రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు.
గత నెలలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కూటమి నుంచి కుమార్ వైదొలగి, కాంగ్రెస్తో మహాఘటబంధన్ (మహాకూటమి)లో చేరిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ నిర్వహించిన మొదటి ర్యాలీ ‘జన్ భవన మహాసభ’. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు లాలూ-నితీష్ ద్వయాన్ని తుడిచిపెడతారని, 2025లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “2014లో, మీకు (బీహార్ సీఎం నితీష్ కుమార్) 2 లోక్సభ స్థానాలు మాత్రమే ఉండేవి, 2024 లోక్సభ ఎన్నికలు రానివ్వండి. బిహార్ ప్రజానీకం లాలూ-నితీష్ ద్వయాన్ని తుడిచిపెట్టేస్తారు. మేము పూర్తి మెజారిటీతో 2025 ఎన్నికల్లో ఇక్కడ అధికారంలోకి రాబోతున్నాం.” అని అమిత్ షా అన్నారు. ఈ సారి బిహార్లో మోడీ కమలం మాత్రమే వికసిస్తుందని అన్నారు. నితీష్ కుమార్ ఎలాంటి రాజకీయ సిద్ధాంతాలకు మొగ్గు చూపరని, అధికారంలో కొనసాగేందుకు ఏ పార్టీతోనైనా చేతులు కలపవచ్చని అమిత్ షా అన్నారు. తన ప్రసంగంలో, కేంద్ర హోం మంత్రి రాష్ట్రంలో విమానాశ్రయంతో సహా పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల గురించి మాట్లాడారు.
Also Read
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
Mexico: ప్రధాని మోదీ రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పగలరు
“దాణా కుంభకోణంలో పాల్గొన్న వ్యక్తులు మీ కేబినెట్లో మంత్రులుగా ఉంటే, మీరు వారిని ఎలా పట్టుకుంటారు అని నేను నితీష్ కుమార్, కొత్త మంత్రి లలన్ సింగ్లను అడగాలనుకుంటున్నాను? ఆపై లాలూ ఒత్తిడితో సీబీఐని నిషేధించాలని సీఎం ఆలోచిస్తున్నారు. బిహార్పై ‘జంగిల్ రాజ్’ ప్రమాదం పొంచి ఉంది’’ అని ఆయన అన్నారు. అనంతరం ఈరోజు సాయంత్రం కిషన్గంజ్లో బిహార్కు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేంద్ర హోంమంత్రి సమావేశం కానున్నారు. సాయంత్రం బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశానికి కూడా ఆయన అధ్యక్షత వహించనున్నారు.
తాజావార్తలు
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!