ఫార్ములా ఈ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. కేటీఆర్ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కు రానున్నారు. తెలంగాణ భవన్ నుంచి పది గంటలకు ACB కార్యాలయంలో విచారణ కు వెళ్లనున్నారు. ఈ కారు రేసు కేసులో నీధుల మళ్లింపు, క్యాబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం, సచివాలం బిజినెస్ రూల్స్ ఉల్లంఘనపై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనున్నది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ను ఏసీబీ, ఈడీలు విచారించాయి.
Also Read:Seediri Appalaraju: మందు మీద అధనంగా జీఎస్టీ ఏంటి? మాజీ మంత్రి అప్పలరాజు ప్రశ్న..
ఫార్ములా ఈ-ఆపరేషన్స్ సంస్ధ ప్రతినిధులను గతంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ ప్రశ్నించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను విచారించింది. కేటీఆర్ విచారణ అనంతరం ఏసీబీ ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయనున్నది. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఏసిబి కార్యాలయం వచే అవకాశాం ఉంది. ఈ నేపథ్యంలో ఏసిబి కార్యలయం రూట్ మ్యాప్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
