KTR: ఇప్పుడే ఢిల్లీలో అడుగు పెట్టా.. అప్పుడే వణికిపోతే ఎలా..?

  • ఇప్పుడే ఢిల్లీలో అడుగు పెట్టా.. హైదరాబాద్‌లో అప్పుడే వణికిపోతే ఎలా?
  • హైదరాబాద్‌లో ప్రకంపనలు కనిపిస్తున్నాయి-ఎక్స్‌ (ట్విట్టర్‌)లో కేటీఆర్‌.
Ktr

Ktr

అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా అక్కడికి చేరుకోగానే కేటీఆర్ ‘X’లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ‘ఇప్పుడే ఢిల్లీలో అడుగు పెట్టా.. హైదరాబాద్‌లో అప్పుడే వణికిపోతే ఎలా?.. హైదరాబాద్‌లో ప్రకంపనలు కనిపిస్తున్నాయి’. అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Read Also: Drug Peddlers Arrest: రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ముఠా గుట్టుర

మరోవైపు.. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయింలో విమర్శలు చేస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి కేసులు విత్ డ్రా చేసుకునేందుకు ఢిల్లీ వెళ్ళారా.. మీ తప్పులు మాఫీ చేయించుకునేందుకు బీజేపీ నేతలను కలవడానికి ఢిల్లీ వెళ్లారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: Balagam Venu : ‘ఎల్లమ్మ’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు