KTR: కారు, బుల్డోజర్ మధ్య యుద్ధం.. రాష్ట్రం అంతా జూబ్లీహిల్స్ వైపు చూస్తోంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా హాట్టాపిక్గా మారాయి. జూబ్లీహిల్స్లో మన గెలుపు ఖాయం, మెజార్టీ తెచ్చుకోవడమే మన చేతుల్లో ఉందని తాజాగా జరిగిన సభలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల రోజులు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకు చెప్పాలని.. కారు, బుల్డోజర్ మధ్య యుద్ధం జరుగుతుందని, రాష్ట్రం అంతా జూబ్లీహిల్స్ వైపు చూస్తోందని ఆయన అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలనే ఆకాంక్ష ప్రజల్లో ఉందని కేటీఆర్ అన్నారు.
అలాగే అజారుద్దీన్కు ఎమ్మెల్సీ ఇస్తామని రేవంత్ రెడ్డి ఒక కాగితం ఇచ్చాడు. కానీ, కోర్టు కేసులో ఉన్న అజారుద్దీన్కు ఎమ్మెల్సీ రావడం అసాధ్యం అన్న విషయం రేవంత్కే తెలుసునని ఎద్దేవా చేశారు. ఇది కేవలం ఓట్ల కోసమే చేస్తున్న రాజకీయ నాటకమని, గెలవలేక పక్క దారులు పడుతున్నారని ఆయంబ విమర్శలు గుప్పించారు. ఒక్క ఇంట్లోనే 40 దొంగ ఓట్లు రాయించుకున్నారని విమర్శించారు. గత ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంపై ఆయన సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆ కుటుంబం అనాధ కాదు. ఆ కుటుంబానికి మేమందరం అండగా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం జూబ్లీహిల్స్లో వారికి బలం ఇవ్వడానికి వచ్చాం అని అన్నారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
S*xual Harassment: మైనర్ బాలుడుపై లైంగిక దాడి నిజమే.. దర్యాప్తు ఆధికారి హాట్ కామెంట్స్
ఇక జూబ్లీహిల్స్లో పోరు మొదలైందని.. ప్రజలు మన దిక్కు ఉన్నారని, నిజం మన దిక్కు ఉంది, ధర్మం మన దిక్కు ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ మోసం చేసినందుకు ప్రజలు స్వయంగా సమాధానం చెబుతారని.. మోసపోయిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఈసారి కాంగ్రెస్కు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల రోజులు ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి నిజం చెప్పాలని.. జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగరడం మనందరి లక్ష్యం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
“కాంగ్రెస్ పెద్దలు ముసలమ్మలకు, ముసలయ్యలకు నెలకు రూ.4000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 24 నెలలు గడిచాయి.. ఒక్క పైసా ఇచ్చారా? బాకీ మొత్తం రూ.48,000 అయ్యింది. అలాగే 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పిన హామీ కూడా నెరవేర్చలేదు. నిరుద్యోగ భృతి, మహాలక్ష్మి పథకం అన్నీ మాటలకే పరిమితం అయ్యాయని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాకీల లెక్కను ప్రజల ఇంటింటికీ తీసుకెళ్లాలి. ప్రతి ముసలమ్మకు రూ.48,000, ప్రతి మహిళకు రూ.50,000 బాకీ ఉన్నదని బాకీ కార్డుతో చెప్పాలి. ఈ సారి కాంగ్రెస్ మోసానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని కేటీఆర్ అన్నారు.
Jubilee Hills by-election: రేపటిలోపు అభ్యర్థిని ప్రకటిస్తాం.. గెలిపించాలని కోరుతున్న..!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!