T20 World Cup: ‘కూతురి కల కోసం నగలు అమ్మిన తల్లి’.. భావోద్వేగానికి గురైన ఇండియన్ ప్లేయర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మహిళా క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్ తాను ఈ స్థాయికి చేరడానికి తన తల్లిదండ్రులు చేసిన త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఒక చిన్న గ్రామానికి చెందిన 22 ఏళ్ల క్రాంతి గౌడ్, మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 లో అద్భుతంగా రాణించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనకు ఒక క్రికెట్ కిట్ కొనివ్వడం కోసం తన తల్లి ఏకంగా తన నగలను అమ్ముకుందని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఆ త్యాగమే తనలో బాధ్యతను పెంచిందని, కుటుంబం అండగా ఉంటే బయటి ప్రపంచం ఏమనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. చాలా మంది అమ్మాయిలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వని రోజుల్లో, తన కుటుంబం తన కలలపై నమ్మకం ఉంచి ప్రోత్సహించిందని, అందుకే తనకు నిలకడగా ఆడే శక్తి లభించిందని తెలిపారు. ఆమె సాధించిన విజయంతో ఇప్పుడు వారి గ్రామంలో ఒక క్రికెట్ అకాడమీ కూడా ప్రారంభమైందని, ఎంతోమంది అమ్మాయిలు క్రీడల వైపు అడుగులు వేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
Also Read
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
- Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
ఇటీవల మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో క్రాంతి గౌడ్కు తుది జట్టులో అవకాశం దక్కలేదు. సౌతాఫ్రికా ప్లేయర్ మారిజానే కాప్ లభించిన అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుని 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
దీంతో భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు బౌలింగ్లోనూ కాప్ రెండు వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. భారత ఫీల్డర్ రాధా యాదవ్ రెండు సార్లు కాప్ ఇచ్చిన క్యాచ్లను వదిలేయడం మ్యాచ్ మలుపు తిప్పింది. అయితే, భారత ఎడమచేతి వాటం స్పిన్నర్ శ్రీ చరణి 4 ఓవర్లలో ఒక మెయిడెన్తో కేవలం 24 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ఒంటరి పోరాటం చేసింది. అయినా జట్టును గెలిపించలేకపోయింది. ఈ ఓటమిని పక్కనబెట్టి, రాబోయే మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన చేయాలని భారత జట్టు భావిస్తోంది.
తాజావార్తలు
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
ట్రెండింగ్
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!