Site icon NTV Telugu

Koti Deepotsavam 2025 Day 5: శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో దివ్య వైభవం..!

Koti 5

Koti 5

Koti Deepotsavam 2025 Day 5: హైదరాబాద్‌లో భక్తి తరంగాలు ఉప్పొంగుతున్నాయి. ఏటా కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 మహోత్సవం నాలుగవ రోజు అద్భుతమైన భక్తి వాతావరణంలో సాగింది. వేలాది మంది భక్తులు ఎన్టీఆర్‌ స్టేడియంలో దీపాలు వెలిగిస్తూ “ఓం నమః శివాయ” నినాదాలతో భక్తి కాంతులతో వెలుగులు నింపారు. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమై, 2013లో కోటి దీపోత్సవంగా రూపాంతరం పొందిన ఈ మహోత్సవం, ప్రతి ఏడాది భక్తులకు కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. కార్తీకమాస భక్తి వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ దీపాల మహోత్సవం, “ప్రతి దీపం ఒక ఆత్మజ్యోతి” అనే ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రపంచానికి చాటుతోంది.

 

ఐదవ రోజు కార్యక్రమం గురువుల ఆశీస్సులతో, వేద మంత్రాలతో ప్రారంభమైంది. పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ (అవధూత దత్తపీఠం పీఠాధిపతి, మైసూరు) ఆధ్వర్యంలో అనుగ్రహ భాషణం భక్తుల హృదయాలను తాకింది. తదుపరి పద్మశ్రీ పురస్కార గ్రహీత మహాసహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావు ప్రవచనామృతం భక్తులను ఆధ్యాత్మిక చింతనలో ముంచెత్తింది. అయితే.. ఐదవరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచ్చేశారు.

అలాగే వేదికపై వేదికపై మహాదేవునికి అన్నాభిషేకం, ఉజ్జయిని మహాకాళుని భస్మహారతి పూజలు, భక్తులచే శివలింగాలకు భస్మాభిషేకం వైభవంగా నిర్వహించబడ్డాయి. భక్తులు శ్రద్ధాభక్తులతో పాల్గొని ఆధ్యాత్మిక పరవశాన్ని పొందారు. అనంతరం శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం, పల్లకీ వాహన సేవతో భక్తులకు దివ్య దర్శనం లభించింది. చివరలో సప్తహారతి, లింగోద్భవ దర్శనంతో నాలుగవ రోజు వేడుక కన్నుల పండువగా ముగిసింది. వేలాది దీపాలతో ప్రకాశించిన వేదిక కైలాసాన్ని తలపించింది.

కోటి దీపోత్సవం 2025 వేడుకలు ఈ నెల 13వ తేదీ వరకు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. భక్తి, ఆరాధన, ఆనందాల సమ్మేళనంగా ఈ కోటి దీపోత్సవ మహోత్సవం అందరినీ ఆహ్వానిస్తోంది.

Exit mobile version