Konda Surekha : అవినీతి చేసేవాళ్లే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు
- బీఆర్ఎస్ నేతల కండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు
- సిఎస్ఆర్ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి
- సెల్ఫ్ ఎంక్వైరీకి సిద్ధమా? మాజీ మంత్రులకు కొండా సురేఖ సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha : బీఆర్ఎస్ పార్టీపై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు చేశారు. సిఎస్ఆర్ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొంటూ, తాను ఎప్పుడూ మంత్రులు కమిషన్ తీసుకుంటారని మాత్రమే వ్యాఖ్యానించానని, కాంగ్రెస్ మంత్రులను ఉద్దేశించి కాదని స్పష్టంచేశారు. అయితే తన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు చెందిన కొంతమంది నేతలు తప్పుడు వీడియో ఎడిటింగ్తో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను చెప్పిన మాటల్ని అసంపూర్ణంగా ప్రచారం చేసి బద్నాముచేయాలని ప్రయత్నం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ‘‘నేను ఎవరు అన్నా వాళ్లను తానే అనుకున్నారు… కాంగ్రెస్ మంత్రులు అని నేనెప్పుడూ అనలేదు,’’ అని కొండా సురేఖ స్పష్టం చేశారు.
23 Iravai Moodu Review: 23 ఇరవై మూడు రివ్యూ
Also Read
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
‘‘బీఆర్ఎస్ నేతలు, మంత్రులుగా పనిచేసిన వారు తన ఆస్తులపై సెల్ఫ్ ఎంక్వయిరీ చేయించుకోండి. మంత్రి అయ్యే ముందు మీ ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత పెరిగిందో చెబితే నిజాలు వెలుగులోకి వస్తాయి,’’ అని సురేఖ ఢీగా సవాల్ విసిరారు. ‘‘కవిత ఇల్లు లేదంటారు, కానీ పెద్ద ఇల్లు ఎలా వచ్చింది? కేటీఆర్ ఫార్మ్ హౌస్ ఎలా సాధించారు? అవినీతికి పాల్పడకపోతే ఈ స్థాయికి ఎలా వచ్చారు?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు పారదర్శకంగా, అర్హులకే అందుతున్నాయని స్పష్టం చేశారు. ‘‘పేద నియామకాల్లో పూర్తిగా పరిశీలన జరుగుతున్న తర్వాతే నియామకాలు చేస్తున్నాం. కానీ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలతో పథకాలను ఎడాపెడా విమర్శిస్తున్నారు,’’ అని విమర్శించారు.
అంతేకాకుండా.. ‘సెక్రటేరియట్ను బీఆర్ఎస్ పూర్తిగా చెడగొట్టింది. అక్కడ మేమేం మాట్లాడలేని పరిస్థితిని బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించింది. ప్రతి చిన్న ఫైల్కే డబ్బులు తీసుకునే అలవాటు తెచ్చింది అని మండిపడ్డారు. తనపై కొనసాగుతున్న తప్పుడు ప్రచారాలను తట్టుకోలేక పోతున్నట్లు పేర్కొంటూ, దీన్ని వెంటనే ఆపకపోతే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ‘‘మేము ఏం మాట్లాడినా భూతంగా చూస్తున్నారు. ప్రజల ముందు వాస్తవాలు చెప్పినంత మాత్రాన ఎందుకు భయపడుతున్నారు?’’ అని ప్రశ్నించారు.
Gold Rate Today: షాకిచ్చిన బంగారం ధరలు.. గోల్డ్ రేట్స్ తగ్గాయన్న సంతోషం రెండు రోజులే!
తాజావార్తలు
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!