Konda Surekha: మంత్రి కొండా సురేఖ ఇంటిముందు నిరసన.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక!
- మంత్రి కొండా సురేఖ ఇంటిముందు నిరసన
- అక్షయపాత్రకి ఇవ్వొద్దంటూ సీఐటీయూ కార్యకర్తల నిరసన
- ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CITU Workers Protest Outside Minister Konda Surekha’s House: హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు సీఐటీయూ కార్యకర్తలు నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకం అక్షయపాత్రకి ఇవ్వొద్దంటూ మంత్రి ఇంటి ముందు సీఐటీయూ కార్యకర్తలు నిరసనకు దిగారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు కేటాయించే ప్రతిపాదనలను విరమించుకోవాలంటూ నినాదాలు చేశారు. మధ్యాహ్న భోజన పథకంపై ఆధారపడి జీవన సాగిస్తున్న వారికి నష్టం చేసే తీరును విరమించుకోకపోతే.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీఐటీయూ కార్యకర్తలు హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: Viral Video: హృదయ విదారక ఘటన.. బైక్పై భార్య మృతదేహం తరలింపు, నిస్సహాయంగా భర్త!
Also Read
- Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
అక్షయపాత్ర ఫౌండేషన్ అనేది భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసే ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పోషకాహారం అందిస్తుంది. అక్షయపాత్ర 2000 సంవత్సరంలో బెంగళూరులో ఐదు పాఠశాలల్లో 1,500 మంది పిల్లలతో ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 17 వేల పాఠశాలల్లో 2 మిలియన్లకు పైగా పిల్లలకు భోజనం అందిస్తుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని హనుమకొండ జిల్లాలో అక్షయపాత్రకు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ గతంలోనే డిమాండ్ చేశారు.
తాజాగా సీఐటీయూ కార్యకర్తలు మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు నిరసన చేపట్టారు. 20 సంవత్సరాలకు పైగా మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకి భోజనం వండి పెడుతున్నారని, వారికి అన్యాయం చేయొద్దని కోరుతున్నారు. అధికారులు కార్మికుల పొట్ట కొట్టే నిర్ణయాలు తీసుకోవడం సరికాదంటున్నారు. 8 నెలల పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేశారు. మంత్రి కొండా సురేఖ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేయగా.. సుబేదారి పోలీసులు సీఐటీయూ కార్యకర్తలను అడ్డుకొని పోలీసు స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం మంత్రి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
-
Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్కు బీసీసీఐ అల్టిమేటం!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!