Kolkata Rape Case : కోల్కతా కేసులో క్రైమ్ సీన్ తారుమారు ? జనాల వైరల్ ఫోటోపై పోలీసుల వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Rape Case : కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్ బయటపడింది. ఈ నేపథ్యంలో ఓ వైరల్ ఫోటో వివాదాన్ని సృష్టించింది. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ప్రదేశానికి సంబంధించిన ఫోటో వైరల్గా మారిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేరారోపణ ప్రదేశంలో చాలా మంది వ్యక్తులు ఉన్నట్లు చిత్రంలో కనిపిస్తోంది. ఈ ఫోటో వైరల్ అయిన తర్వాత, సెమినార్ హాల్లో చాలా మంది ఉన్నందున సాక్ష్యాలను తారుమారు చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Read Also:Drinking Alcohol Women: మహిళలు మద్యం తాగడం వల్ల ఎన్ని ప్రభావాలు సంభవిస్తాయో తెలుసా..
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
కాగా, ఈ వివాదంపై కోల్కతా పోలీస్ డిసి (సెంట్రల్) ఇందిరా ముఖర్జీ శుక్రవారం విలేకరుల సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులందరూ విచారణ ప్రక్రియలో భాగమేనని, అధీకృత పద్ధతిలో ఘటనా స్థలాన్ని సందర్శించేందుకు అనుమతించామని తెలిపారు. ముఖర్జీ మాట్లాడుతూ, “ఒక ప్రత్యేక వార్తా ఛానెల్ సెమినార్ హాల్ వీడియోలు,చిత్రాలను చూపింది. అందులో చాలా మంది వ్యక్తులు నిలబడి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఈ వ్యక్తులు ఎవరో వెల్లడించలేదు.’’
Read Also:PM Modi: నేడు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
ఆరోపణలను తిరస్కరిస్తూ ముఖర్జీ… “బహుశా అక్కడ ఉండకూడని వ్యక్తులు అక్కడ ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మేము ఆ వీడియో నుండి ఫోటో తీసుకున్నాము. ఫోటోలో ఉన్న వ్యక్తులందరినీ గుర్తించాము. విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ ఫోటో తీశామని, ఆ సమయంలో వీడియోగ్రాఫర్, పోలీస్ కమిషనర్, అదనపు సీపీ-1, లేడీ పోలీస్, ఫోరెన్సిక్ ఆఫీసర్, సాక్షి డాక్టర్, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్, డిటెక్టివ్ డిపార్ట్మెంట్ ఏసీపీ వంటి ఇతర వ్యక్తులు హాల్ లో ఉన్నారని గుర్తించారని చెప్పారు. అధికారం లేని ఏ వ్యక్తిని ఈ ప్రాంతంలోకి అనుమతించలేదు. దర్యాప్తు ప్రక్రియలో భాగంగానే వారు అక్కడికి వెళ్లారు.’’ అన్నారు. మరోవైపు తాము బాధ్యతలు చేపట్టకముందే క్రైమ్ స్పాట్ మార్చామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!