Kolkata Rape Case : కోల్కతా కేసులో క్రైమ్ సీన్ తారుమారు ? జనాల వైరల్ ఫోటోపై పోలీసుల వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Rape Case : కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్ బయటపడింది. ఈ నేపథ్యంలో ఓ వైరల్ ఫోటో వివాదాన్ని సృష్టించింది. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ప్రదేశానికి సంబంధించిన ఫోటో వైరల్గా మారిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేరారోపణ ప్రదేశంలో చాలా మంది వ్యక్తులు ఉన్నట్లు చిత్రంలో కనిపిస్తోంది. ఈ ఫోటో వైరల్ అయిన తర్వాత, సెమినార్ హాల్లో చాలా మంది ఉన్నందున సాక్ష్యాలను తారుమారు చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Read Also:Drinking Alcohol Women: మహిళలు మద్యం తాగడం వల్ల ఎన్ని ప్రభావాలు సంభవిస్తాయో తెలుసా..
Also Read
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
కాగా, ఈ వివాదంపై కోల్కతా పోలీస్ డిసి (సెంట్రల్) ఇందిరా ముఖర్జీ శుక్రవారం విలేకరుల సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులందరూ విచారణ ప్రక్రియలో భాగమేనని, అధీకృత పద్ధతిలో ఘటనా స్థలాన్ని సందర్శించేందుకు అనుమతించామని తెలిపారు. ముఖర్జీ మాట్లాడుతూ, “ఒక ప్రత్యేక వార్తా ఛానెల్ సెమినార్ హాల్ వీడియోలు,చిత్రాలను చూపింది. అందులో చాలా మంది వ్యక్తులు నిలబడి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఈ వ్యక్తులు ఎవరో వెల్లడించలేదు.’’
Read Also:PM Modi: నేడు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
ఆరోపణలను తిరస్కరిస్తూ ముఖర్జీ… “బహుశా అక్కడ ఉండకూడని వ్యక్తులు అక్కడ ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మేము ఆ వీడియో నుండి ఫోటో తీసుకున్నాము. ఫోటోలో ఉన్న వ్యక్తులందరినీ గుర్తించాము. విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ ఫోటో తీశామని, ఆ సమయంలో వీడియోగ్రాఫర్, పోలీస్ కమిషనర్, అదనపు సీపీ-1, లేడీ పోలీస్, ఫోరెన్సిక్ ఆఫీసర్, సాక్షి డాక్టర్, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్, డిటెక్టివ్ డిపార్ట్మెంట్ ఏసీపీ వంటి ఇతర వ్యక్తులు హాల్ లో ఉన్నారని గుర్తించారని చెప్పారు. అధికారం లేని ఏ వ్యక్తిని ఈ ప్రాంతంలోకి అనుమతించలేదు. దర్యాప్తు ప్రక్రియలో భాగంగానే వారు అక్కడికి వెళ్లారు.’’ అన్నారు. మరోవైపు తాము బాధ్యతలు చేపట్టకముందే క్రైమ్ స్పాట్ మార్చామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది.
తాజావార్తలు
-
Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!