ఐపీఎల్ 2026లో భాగంగా జరిగే 25వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ చేయనుంది.
Also Read:Pakistan: ‘‘డీలిమిటేషన్ బిల్లు’’పై పాకిస్తాన్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..
19వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అజింక్య రహానే ఈరోజు విజయంతో తన ఖాతాను తెరవాలని చూస్తున్నాడు. మరోవైపు, తమ మొదటి రెండు మ్యాచ్లలో ఓడిపోయిన తర్వాత గుజరాత్ టైటాన్స్ బలంగా పుంజుకుంది. శుభ్మన్ గిల్ వరుసగా మూడో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
