Hyderabad: సంక్రాంతి పండగ ముగిసింది. ఇంకా పతంగి ప్రాణాలు తీస్తూనే ఉంది. తాజాగా పతంగి వల్ల మరో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. సరదాగా గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు ఓ బాలుడు భవనంపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా నగర్లో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన హేమంత్ (10) అనే బాలుడు సాయిబాబా నగర్లో బిల్డింగ్పైకి ఎక్కి గాలిపటం ఎగురవేస్తూ.. ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందాడని వెల్లడించారు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మరోవైపు.. పతంగి కోసం వెళ్లిన ఆరేళ్ల బాలుడు బాలుడు విద్యుత్ ఘాతానికి గురైన ఘటన కూకట్పల్లి ప్రగతి నగర్లో చోటు చేసుకుంది. ట్రాన్స్ఫార్మర్ పై పడిన కైట్ను తీసుకునేందుకు వెళ్ళి ప్రమాదానికి గురయ్యాడు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు బయటకు వచ్చి చూశారు. కొద్ది దూరంలో బాలుడు ఎగిరిపడటాన్ని గమనించారు. వెంటనే ఆర్పేసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాలనీలో అత్యంత ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్ ఉందని స్థానికులు చెబుతున్నారు.. కాలనీ వాసులు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
READ MORE: Liquor Shops Closed: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రెండ్రోజులు వైన్స్ బంద్!