NTV Telugu Site icon

Kishan Reddy: ఈ నెల 19న కిషన్ రెడ్డి నామినేషన్.. హాజరుకానున్న కేంద్రమంత్రి

Kishan Reddy

Kishan Reddy

సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఈనెల 18న సాయంత్రం ఆయన హైదరాబాద్ కు రానున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమావేశంలో పాల్గొననున్నారు రాజ్నాథ్ సింగ్. ఇదిలా ఉంటే.. ఈ నెల 21న రాష్ట్రానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ రానున్నారు. మెదక్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల్లో యాదవ సంఘాలతో ఆయన భేటీ కానున్నారు.

Read Also: Actor Dies Of Heart Attack: ఇండస్ట్రీలో వరుస విషాదాలు.. నెల రోజుల్లో నాలుగో నటుడు మృతి!

ఇదిలా ఉంటే.. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా తన పేరును ప్రకటించిన నాటి నుంచే.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే తన నియోజకవర్గం మొత్తాన్ని ఓ దఫా చుట్టేశారు. కేంద్రంలో పదేళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఇళ్లుళ్లు తిరుగుతున్నారు. అదే సమయంలో.. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలన వైఫల్యాలు, కాంగ్రెస్ హామీలను వివరిస్తూ ప్రజల ముందుకెళ్తున్నారు. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న మోడీ వేవ్ తెలంగాణలో పార్టీకి గణనీయ స్థానాలు సాధించిపెడుతుందని కమలం శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Also: YS Bharathi Reddy: రంగంలోకి దిగన వైఎస్ భారతి.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం..!