Kishan Reddy: త్వరలోనే మోదీ నేతృత్వంలో జన గణన జరగబోతుంది..
- మహిళను శక్తిగా కొలిచే సంప్రదాయం ఒక్క భారత్ లోనే ఉంది- కిషన్ రెడ్డి
- దేశ సరిహద్దుల్లో రక్షణ విభాగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు
- ఎక్కువ మంది మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ బీజేపీ- కిషన్ రెడ్డి
- త్వరలోనే మోదీ నేతృత్వంలో జన గణన జరగబోతుంది- కిషన్ రెడ్డి
- అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల పునర్విభజన జరగబోతుంది- కిషన్ రెడ్డి
- వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలు అవుతాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళను శక్తిగా కొలిచే సంప్రదాయం ఒక్క భారత్లోనే ఉందని అన్నారు. ఇంటిని నడిపే మాతృమూర్తి మహిళ అని పొగిడారు. పార్టీలో ఎలాంటి బాధ్యతలు ఇచ్చిన అద్భుతంగా మహిళా మోర్చా నేతలు పని చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మహిళలు బాగా పని చేశారు.. దేశ సరిహద్దుల్లో రక్షణ విభాగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యధిక మహిళా పైలట్లు ఇండియాలో ఉన్నారు.. ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ రద్దు చేసిన ప్రభుత్వం మోదీది అని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రసూతి సెలవులు 26 వారాలకు పొడిగించిన ఘనత మోదీ సర్కార్ది అన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు బిల్లునే ఆమోదించారని పేర్కొన్నారు.
Read Also: Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో కన్నీరు.. కారణం ఏంటంటే..
Also Read
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
- Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
- Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
మరోవైపు.. 2014-2019 తొలి తెలంగాణ ప్రభుత్వంలో మహిళా మంత్రి లేకుండా పాలన సాగిందని ఆరోపించారు. ఎక్కువ మంది మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ బీజేపీ అని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జె కట్టి మండుటెండల్లో మహిళలు పాల్గొన్నారు.. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ లానే పాలన చేస్తోందని మండిపడ్డారు. ఫ్రీ బస్ ఇచ్చిన రేవంత్.. అందులో తిరుగుతూ మిగిలిన హామీలు అమలు చేసినట్లు ఫీల్ అవ్వమని మహిళలకు చెబుతున్నారన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉంది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90 శాతం మహిళా టీచర్లు, గ్రాడ్యుయేట్లు బీజేపీకి ఓటు వేశారని తెలిపారు. మహిళలు పిడికిలి బిగించి రేవంత్ సర్కారును నిలదీయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Wife harassment: భార్య, అత్త వేధింపులకు మరొకరు బలి.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్..
నియోజక వర్గాల పునర్విభజనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. త్వరలోనే మోదీ నేతృత్వంలో జన గణన జరగబోతుందని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల పునర్విభజన జరగబోతుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలు అవుతాయని పేర్కొన్నారు. ఇప్పుడున్న స్థానాల్లో ఏ ఒక్క సీటు తగ్గకుండా అసెంబ్లీ, లోక్ సభ స్థానాల పునర్విభజన జరుగుతుందని వెల్లడించారు. కావాలనే ఇక్కడున్న రేవంత్ సర్కార్.. బీఆర్ఎస్, డీఎంకే పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క సీటును కూడా తగ్గించే ఆలోచన తమకు లేదని చెప్పారు. కొంతమంది దక్షిణ భారతంలో ఆల్ పార్టీ మీటింగ్ అంటూ హడావుడి చేస్తున్నారు.. జనాభా లెక్కల సేకరణ చేస్తూ నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.. అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ స్థానాల్లో ఒక్కటి కూడా వదిలిపెట్టవద్దు.. కుటుంబ రాజకీయాలు వద్దు.. ఇది మంచి సంప్రదాయం కాదని కిషన్ రెడ్డి సూచించారు.
తాజావార్తలు
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
-
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
-
Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
-
Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?