NTV Telugu Site icon

Kisan Agri Show 2023:మార్చి3 నుంచి 5 వరకూ కిసాన్ ఆగ్రి షో

Kisan Agro

Kisan Agro

హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద ఆగ్రి షోకు ఆతిథ్యం ఇస్తోంది. కిసాన్​ ఆగ్రి షోను ప్రారంభించనున్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభిస్తారు. మార్చి 3 నుంచి 5 వరకు కొనసాగనుంది ఎగ్జిబిషన్​. 150 మందికిపైగా ఎగ్జిబిటర్లు.. 30 వేల మంది విజిటర్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.దేశంలోనే అతిపెద్ద ఆగ్రి షో “కిసాన్“ హైదరాబాద్​ లో జరగనుంది. ‘‘కిసాన్” ఆగ్రి షో హైదరాబాద్​లోని​ హైటెక్స్​లో మార్చి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరగనున్నది. ఈ ఎగ్జిబిషన్​ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ప్రారంభించనున్నారు.  ఇప్పటికే ఈ ఆగ్రి షో చాలా సార్లు విజయవంతం కాగా, ఈసారి నిర్వహించడం 32వసారి. ఈ ‘‘కిసాన్​’’ ఆగ్రి షో ఎగ్జిబిషన్​ రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీక్షకులకు అందుబాటులో ఉంటుంది.గతంలో నిర్వహించిన ఆగ్రి షో ఎగ్జిబిషన్​లకు అన్ని వర్గాల నుంచి చాలా మంచి స్పందన లభించింది.

Read Also:Telangana Congress : ఈటెల రాజేందర్ పై ఛార్జ్ షీట్ విడుదల చేసిన కాంగ్రెస్ నేతలు

దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ రంగంలోని ఇన్వెస్టర్లు, రైతులకు ఈ షో ఎంతో ఉపయోగపడింది.  ఈసారి ‘‘కిసాన్​’’ ఆగ్రి షో లో 150 మందికిపైగా ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనుండగా, 30 వేల మందికి పైగా విజిటర్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 12 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తుండగా.. దీనిలో 3 రోజుల వ్యవధిలో 160కి పైగా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. వ్యవసాయ రంగంలో కొత్తగా వచ్చిన మార్పులు, అధునాతన పరికరాలు ఇక్కడ ప్రదర్శనకు ఉంటాయి.వ్యవసాయ రంగంలోని స్టార్టప్​ సంస్థలకు ప్రోత్సాహం అందించే ‘‘స్పార్క్​’’ ఈ ఎగ్జిబిషన్​లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సంస్థ ఇక్కడ అధునాతన సాంకేతికలు, వినూత్న ఆలోచనలను ప్రదర్శించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. 20 వరకు స్టార్టప్ సంస్థలు తమ సాంకేతికతలు, కాన్సెప్టులను ఇక్కడ ప్రదర్శిస్తాయి.

కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐకార్​ సంస్థలు కూడా తమ ప్రదర్శనశాలలను జ్ఞాన కేంద్రం పేరిట ఏర్పాటు చేయనున్నాయి. ఈ కిసాన్​ ఎగ్జిబిషన్​ రైతులు తమకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులు, నీటి నిర్వహణ, పరికరాలు, వాడే పద్ధతులు, విత్తనాలు, ప్లాంటింగ్​ మెటీరియల్ తదితర విషయాల గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఓపెన్​ ఎరెనాలో పెద్ద యంత్రాలు, పరికరాలను ప్రదర్శనకు ఉంచుతారు. భారతీయ వ్యవసాయ, వాతావరణ పరిస్థితులకు అవసరమైన ఎన్నో నూతన సాంకేతికతలను రైతులు ఈ ఎగ్జిబిషన్​లో చూడవచ్చు.

Read Also: Naveen Case: ‘విక్రమ్’ సినిమా చూసి వేళ్లు కోసేశా.. ఇంకా కసి తీరలేదు