Key Poll In Uttar Pradesh: ఎన్డీయే వర్సెస్ ఇండియా.. ఉత్తరప్రదేశ్లో ఆ కూటమికి తొలిపోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Key Poll In Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్లోని ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నిక ద్వారా ఎన్డీయే – ఇండియా కూటముల మధ్య తొలి ఎన్నికల పోరు ప్రారంభమవుతోంది. ప్రతిపక్ష ఇండియా కూటమి భవిష్యత్ ఎన్నికలలో సాధ్యమైనంత వరకు కలిసి పోటీ చేస్తామని చెప్పిన కొన్ని రోజుల తర్వాత.. 28 మంది సభ్యుల కూటమి మొదటి పరీక్షను ఎదుర్కొంటోంది. బీఎస్పీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను నిలబెట్టకుండా ఎస్పీకి మద్దతివ్వడంతో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య ఇది తొలి ఎన్నికగా చెప్పవచ్చు. రాష్ట్రీయ లోక్ దళ్, అప్నా దళ్ (కామెరావాడి), వామపక్షాలు సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలిచాయి. ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నిక రేపు (సెప్టెంబర్ 5) జరగనుంది.
Also Read: Mumbai: అపార్ట్మెంట్లో మహిళా ఫ్లైట్ అటెండెంట్ దారుణ హత్య
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో మాట్లాడిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఘోసీ ప్రజలు తమ పార్టీ అభ్యర్థికి ‘రికార్డ్ విజయం’ అందజేయాలని తమ మనస్సులో నిర్ణయించుకున్నారని ప్రకటించారు. “ఘోసీ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఏమీ మిగలలేదు, ఎందుకంటే ప్రజలు మా అభ్యర్థిని నిర్ణయించారు. ప్రజలను జాగ్రత్తగా చూసుకునే సుధాకర్ సింగ్ రికార్డు మెజారిటీతో విజయం సాధిస్తారు” అని అఖిలేష్ యాదవ్ అన్నారు. యోగి ఆదిత్యనాథ్ ఘోసీ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచేందుకు వివాదాస్పద ప్రసంగాలు చేశారని ఆయన ఆరోపించారు. అక్కడ ఏ మంత్రులు ప్రచారం చేసినా ఫలితం మారదన్నారు. కేంద్రంలో పదేళ్లు, రాష్ట్రంలోని ఆరేళ్ల బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు.
యోగి ఆదిత్యనాథ్ వరుసగా పదవీలోకి రాకముందే రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తమ పార్టీ మౌలిక సదుపాయాల పనుల నుంచి బీజేపీ లబ్ధి పొందిందని ఆయన ఆరోపించారు. ఇవాళ మౌలిక సదుపాయాలు కల్పించిన సమాజ్వాదీ పార్టీ వల్లే ప్రతి ఇంటికి కరెంటు వచ్చిందని అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ చేసిందంతా మీటర్లు పెట్టి మరీ బిల్లులు పంపడమేనని ఎద్దేవా చేశారు.
దారాసింగ్ చౌహాన్ 2022కు ముందు యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. 2022 ఎన్నికలకు ముందు ఎస్పీలో చేరి, ఘోసీ నుండి గెలిచారు. అయితే ఈ ఏడాది జులైలో తిరిగి బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. 2012లో ఈ స్థానంలో గెలుపొందిన, అనుభవజ్ఞుడైన సుధాకర్ సింగ్ను ఎస్పీ రంగంలోకి దించింది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!