మోర్ దేన్ ఫ్రెండ్స్ డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. తారామతి బారాదరి లో జరిగిన పార్టీ లో డ్రగ్స్ సప్లై చేసిన వారి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రముఖ అంతర్జాతీయ డీజే జాసన్ డైలాన్ పట్టుబడంతో కాంటాక్ట్ లిస్ట్ పై ఈగల్, నార్కోటిక్స్ పోలీసులు నిఘా పెట్టారు. ఖరీదైన పార్టీకి నలుగురు నుండి 10 వరకు గ్రూపులుగా హాజరైనట్లు గుర్తించారు. ఒక్కో గ్రూప్ కి రూ.50 వేల నుండి రూ.1.25 లక్షల వరకు రేట్ నిర్ధేశించిన ఈవెంట్ నిర్వాహకుడు. ఈవెంట్ నిర్వాహకుడు డీజే జాసన్ డైలాన్ గతంలో డ్రగ్స్ సప్లై, వినియోగించిన చరిత్ర ఉన్నట్లు పోలీసుల విచారణ లో వెల్లడైంది.
Also Read:Dilraju: అనిల్ రావిపూడి హీరోగా దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. త్వరలోనే నటుడిగా ఎంట్రీ!
యాక్టర్ సర్వర్ , ట్రేడింగ్ వ్యాపారం చేసే భార్యాభర్తలు నిహార్, ఆషి కంటాక్ట్స్ పై విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు. తారామతి లో పార్టీ అరేంజ్ చేసిన డీజే లు జాక్ & జాసన్. 2023 లో మిస్టర్ గ్లోబల్ గా నిలిచిన డీజే జాసన్ కు డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. జాసన్ పై గతంలోను డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. పార్టీ పోస్టర్ల పైనా say no to drugs అని తూతుమంత్రంగా పెట్టిన జాసన్.. డీజే జాసన్ కు ఆంఫిటమైన్ పాజిటివ్ గా తేలినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ముంబై లో స్థిరపడ్డ జాసన్.. డ్రగ్స్ సేవించి పోలీసులకు పాజిటివ్ గా దొరికిపోయాడు డీజే జాసన్.