Nipah Virus: కేరళలో నిపా వైరస్ కలకలం.. వారం పాటు స్కూళ్లు, కాలేజీలు బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nipah Virus: కేరళలోని కోజికోడ్లో నిపా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి భయానక వాతావరణం నెలకొంది. నిపా వైరస్ దృష్ట్యా, కోజికోడ్లోని అన్ని విద్యాసంస్థలు వచ్చే ఆదివారం వరకు అంటే సెప్టెంబర్ 24 వరకు మూసివేయబడ్డాయి. ఇందులో పాఠశాలలు, ప్రొఫెషనల్ కళాశాలలు, ట్యూషన్ సెంటర్లు కూడా ఉన్నాయి. వారం రోజుల పాటు అన్ని విద్యా సంస్థల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించవచ్చని జిల్లా యంత్రాంగం చెబుతోంది. ప్రస్తుతం నిపా వైరస్ సోకిన వారితో పరిచయం ఉన్న వారి జాబితా 1080కి చేరుకుందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శుక్రవారం తెలిపారు. వీరిలో శుక్రవారం ఒక్కరోజే 130 మంది జాబితాలో చేరారు. మొత్తం 1080 మందిలో 327 మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇతర జిల్లాల్లో నిపా సోకిన వ్యక్తుల కాంటాక్ట్ లిస్ట్లో మొత్తం 29 మంది ఉన్నారని ఆరోగ్య మంత్రి చెప్పారు. వీరిలో మలప్పురం నుండి 22 మంది, వాయనాడ్ నుండి ఒకరు, కన్నూర్, త్రిస్సూర్ నుండి ముగ్గురు చొప్పున ఉన్నారు.
Read Also:NTR: సైమా బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్… ఏడేళ్ల తర్వాత అవార్డ్
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
హై-రిస్క్ కేటగిరీలో 175 మంది సాధారణ పౌరులు కాగా 122 మంది ఆరోగ్య కార్యకర్తలు. కాంటాక్ట్ లిస్ట్లో చేరిన వారి సంఖ్య పెరగవచ్చని ఆరోగ్య మంత్రి కూడా చెప్పారు. ఆగస్టు 30న ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి రిపోర్టు పాజిటివ్గా వచ్చిందని, దాని వల్లే రాష్ట్రంలో నిపా కేసులు పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరు నిపా వైరస్ కేసులు నమోదయ్యాయి. కేరళలో విజృంభించిన ఈ వైరస్ కారణంగా భయానక వాతావరణం నెలకొంది. ఆగస్టు 30న ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి అంత్యక్రియలకు కనీసం 17 మంది హాజరయ్యారు. ఈ వ్యక్తులందరినీ ఐసోలేషన్లో ఉంచారు. నిపా వైరస్ సోకిన నలుగురు వ్యక్తులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిపా కేసులకు చికిత్స అందిస్తున్న అన్ని ఆస్పత్రుల్లో మెడికల్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బోర్డు సమావేశం రోజుకు రెండుసార్లు జరగనుంది. దీని తర్వాత తయారు చేసిన నివేదికను ఆరోగ్య శాఖకు సమర్పించాలని కోరారు. రాష్ట్ర ‘ఇన్ఫెక్షియస్ డిసీజ్ కంట్రోల్ ప్రోటోకాల్’ ఆధారంగా జిల్లా కలెక్టర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also:Telangana: నేడే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం.. కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్న కేసీఆర్
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!