మూడ్రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో కేసీఆర్ సమావేశమవుతారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై చర్చిస్తారు. రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనుల సమీక్షకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించే భేటీలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరు కావడం ఇదే మొదటిసారి. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో నిరుద్యోగ యువ తకు ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు సంబంధిత అంశాలపై సీఎం ప్రతిపాదన చేస్తారని తెలుస్తోంది. తర్వాత కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో కేసీఆర్ భేటీ అవుతారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చిస్తారు. సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
