Kaun Banega Crorepati 17: రూ.7 కోట్ల ప్రశ్న ఇదే, సమాధానం మీకు తెలుసా..?
- కౌన్ బనేగా కరోడ్పతి 17లో మొదటి కోటీశ్వరుడిగా ఆదిత్య కుమార్..
- రూ. కోటి ప్రశ్నకు 50-50 ఉపయోగించి విజయం సాధించిన కంటెస్టెంట్..
- రూ. 7 కోట్ల ప్రశ్నకు ఆన్సర్ తెలియక ఆట నుంచి క్విట్ అయినా ఆదిత్య కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaun Banega Crorepati 17: అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి 17 మొదటి కోటీశ్వరుడిని చేసింది. తాజాగా జరిగిన ఈ ఎపిసోడ్లో ఉత్తరాఖండ్కి చెందిన ఆదిత్య కుమార్, అత్యంత ప్రతిష్టాత్మకమైన రూ.1 కోటి ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. అయితే, ఆ తర్వాత ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేకపోవడంతో ఆటను మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. కోటి రూపాయలు గెలుచుకున్న ఆదిత్య కుమార్.. ‘కౌన్ బనేగా కరోడ్పతి 17లో మొదటి కంటెస్టెంట్ అయ్యాడు.
Read Also: Irfan Pathan: అతడు అడిగితే నా ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తా.. ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
రూ. 1 కోటి ప్రశ్న: ఈ క్రింది మూలకాలలో ఏది ప్లూటోనియాన్ని విడదీసిన శాస్త్రవేత్త పేరు మీదుగా చెప్పబడింది?.. అదే ప్లూటోనియం మొదటి అణుబాంబు తయారీలో ఉపయోగించబడింది..?
ఆప్షన్లు:
A. సీబార్గియం
B. ఐన్స్టీనియం
C. మైట్నేరియం
D. బోహ్రియం
ఈ ప్రశ్నకు ఆదిత్య కుమార్ “50-50” లైఫ్లైన్ ఉపయోగించుకుని చివరికి A (సీబార్గియం) అనే ఆప్షన్ను ఎంచుకున్నారు. అది కరెక్ట్ సమాధానం కావడంతో వెంటనే, అమితాబ్ బచ్చన్ తన ప్రత్యేకమైన శైలిలో అభినందించారు. దీంతో కంటెస్టెంట్ ఆదిత్య బిగ్ బీ కాళ్లకు నమస్కరించి, తన తల్లిదండ్రులను కౌగిలించుకున్నాడు. అనంతరం.. సీబార్గియం (ఎస్జీ) అమెరికన్ కెమిస్ట్ గ్లెన్ టీ. సీబార్గ్ పేరుమీదుగా పెట్టబడింది. ఆయన తన బృందంతో కలిసి 1940లో ప్లూటోనియాన్ని వేరు చేశారు. చరిత్రలో ఒక మూలకం తన పేరుమీదుగా పెట్టబడిన ఏకైక శాస్త్రవేత్త ఈయనే. ఈ మూలకం నాగసాకి అణుబాంబులోనూ ఉపయోగించబడింది.
Read Also: Viral Video: మీ పిల్లలు మొబైల్స్ కు బానిసలయ్యారా..? ఒక్కసారి ఈ వీడియో చూపించండి!
ఏడు కోట్ల ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయిన ఆదిత్య..
ప్రశ్న: 1930లలో భారత్ను సందర్శించి, తాజ్ మహల్, సాంచీ స్తూపం, ఎల్లోరా గుహలను చిత్రించిన జపాన్ చిత్రకారుడు ఎవరు?..
ఆప్షన్లు:
A. హిరోషిమా సుగిమోటో
B. హిరోషి సెన్జు
C. హిరోషి యోషిదా
D. హిరోషి నకాజిమా
అయితే, రూ. 7 కోట్ల ప్రశ్నకు ఆదిత్య కుమార్కు సరైన సమాధానం తెలియకపోవడంతో షో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వెళ్ళేముందు ఏదో ఒకటి చెప్పాలని బిగ్ బీ సూచించగా.. ఆప్షన్ D (హిరోషి నకాజిమా) ని ఎంపిక చేసుకున్నాడు. కానీ అది తప్పు.. సరైన సమాధానం C (హిరోషి యోషిదా) అని అబితాబ్ బచ్చన్ తెలిపారు. కాగా, 1876లో జన్మించిన హిరోషి యోషిదా, 1920లో వుడ్బ్లాక్ ప్రింట్లను రూపొందించడం ప్రారంభించారు. 1930లో భారత్తో పాటు దక్షిణాసియా దేశాల్లో నాలుగు నెలల పాటు పర్యటించి, 32 వుడ్బ్లాక్ ప్రింట్ల సిరీస్ ను రూపొందించారు. భారతదేశంలోని ప్రత్యేకమైన కాంతి గుణం అతడ్ని బాగా ఆకట్టుకుంది. తన చిత్రాల్లో దానిని ప్రతిబింబించారు.
Aditya Kumar become the first crorepati of the season! Will he create history by winning 7 crores! pic.twitter.com/lqp9zua8DF
— Sony LIV (@SonyLIV) August 20, 2025
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!