Site icon NTV Telugu

MLC Kavitha: కొత్త పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు..

Mlc Kavitha

Mlc Kavitha

పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని నిర్ధారించుకున్న అనంతరం బీఆర్ఎస్ నుంచి కవితను కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కవిత బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. తాజాగా కొత్త రాజకీయ పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్టీ పెట్టేముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారు. ప్రస్తుతం నేనూ అదే చేస్తున్నాను అని వెల్లడించారు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయి‌న మెదటి కూతుర్ని నేనే అని తెలిపారు. ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ ను అలర్ట్ చేశాను అని చెప్పారు.

Also Read:USA: టెక్నికల్ ఇష్యూతో..విమాన ప్రయాణాలకు ఆటంకం

కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారు.. హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్ప నాకు వేరే కోపం లేదు అని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన నాకు లేదని అన్నారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ నాకు ఫోన్ చేయలేదు.. నేను కాంగ్రెస్ లో ఎవర్నీ అప్రోచ్ కాలేదుని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ .. పదే పదే నాపేరు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు.. ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నాడేమో? అని తెలిపారు. ఒక వర్గం కోసం కాదు.. ప్రజలందరి కోసం పనిచేయాలనుకుంటున్న.. బీసీ ఇష్యూ నా మనస్సుకు దగ్గరగా అనిపించిందని తెలిపారు. ప్రస్తుతం ఫ్రీ బర్డ్ .. నా ద్వారాలు తెలిచే ఉన్నాయి.. చాలామంది వచ్చి నన్ను కలుస్తున్నారు.. నాతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దది అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version