Karnataka vs MP: కర్ణాటక బౌలర్లపై ‘వెంకటేష్ అయ్యర్’ దూకుడు.. 160 బంతులు మిగిలుండగానే మధ్యప్రదేశ్ విజయం..!
- విజయ్ హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్ A మ్యాచ్లో మధ్యప్రదేశ్ ఘన విజయం
- అహ్మదాబాద్ వేదికగా కర్ణాటకపై 7 వికెట్ల తేడాతో విజయం
- కేవలం 23.2 ఓవర్లలోనే లక్ష్య ఛేదన
- 160 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ముగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka vs MP: అహ్మదాబాద్ వేదికగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీ 2025–26లో భాగంగా ఎలైట్ గ్రూప్ A మ్యాచ్లో మధ్యప్రదేశ్ జట్టు కర్ణాటకపై 160 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. కేవలం 23.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
Punjab vs Mumbai: సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్ వృధా.. ఉత్కంఠ పోరులో పంజాబ్ ఒక్క పరుగుతో విజయం..!
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు 47.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌట్ అయింది. కర్ణాటక ఇన్నింగ్స్ లో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 49 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత దేవ్దత్ పడిక్కల్ 35 పరుగులు చేయగా, చివర్లో విద్యాధర్ పాటిల్ 34 పరుగులతో కొంత ప్రతిఘటన చూపించాడు. అయితే మధ్యప్రదేశ్ బౌలింగ్ లైనప్ దెబ్బకు కర్ణాటక బ్యాటర్లు నిలవలేకపోయారు.
మధ్యప్రదేశ్ తరఫున శివాంగ్ కుమార్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్ను పూర్తిగా తమ వైపుకు తిప్పేసాడు. 10 ఓవర్లలో 45 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు శివాంగ్. అతనికి తోడు కుమార్ కార్తికేయ, త్రిపురేష్ సింగ్, ఆర్యన్ పాండే లు చెరో వికెట్ తీసి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కర్ణాటక నిర్ణీత ఓవర్లు కూడా ఆడలేకపోయింది.
ఇక 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ బ్యాటింగ్ మొదటి నుంచే దూకుడుగా సాగింది. ఓపెనర్లు యశ్ దూబే (40), హిమాన్షు మంత్రి (34) పరుగులతో జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత కెప్టెన్ వెంకటేష్ అయ్యర్ కర్ణాటక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 33 బంతుల్లోనే 65 పరుగులు (4 ఫోర్లు, 5 సిక్సర్లు) సాధించించి మ్యాచ్ను వన్ సైడ్ గా మార్చేశాడు. అతనికి తోడుగా త్రిపురేష్ సింగ్ 12 బంతుల్లో 36 పరుగులతో అజేయంగా నిలవడంతో లక్ష్యాన్ని వేగంగా చేరుకుంది మధ్యప్రదేశ్ జట్టు. కేవలం 23.2 ఓవర్లలోనే 208/3 స్కోర్ చేసి 160 బంతులు మిగిలుండగానే ఘన విజయాన్ని అందుకుందింది. 5 వికెట్ల ప్రదర్శనకు గాను శివాంగ్ కుమార్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Madhya Pradesh win 👏
Venkatesh Iyer finishes it off in style 😎
They chase down 208 in 23.2 overs against Karnataka 👌
A commanding win in a crucial match 🔥
Scorecard ▶️ https://t.co/szHbOWqpZK#VijayHazareTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/9v4WdTXk03
— BCCI Domestic (@BCCIdomestic) January 8, 2026
SRH SCOUTING…!!!!
– Sunrisers Hyderabad got Shivang Kumar for just 30 Lakhs. 🤯pic.twitter.com/6mTv3cggwX
— Johns. (@CricCrazyJohns) January 8, 2026
తాజావార్తలు
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
-
Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..