Karnataka vs MP: కర్ణాటక బౌలర్లపై ‘వెంకటేష్ అయ్యర్’ దూకుడు.. 160 బంతులు మిగిలుండగానే మధ్యప్రదేశ్ విజయం..!
- విజయ్ హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్ A మ్యాచ్లో మధ్యప్రదేశ్ ఘన విజయం
- అహ్మదాబాద్ వేదికగా కర్ణాటకపై 7 వికెట్ల తేడాతో విజయం
- కేవలం 23.2 ఓవర్లలోనే లక్ష్య ఛేదన
- 160 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ముగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka vs MP: అహ్మదాబాద్ వేదికగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీ 2025–26లో భాగంగా ఎలైట్ గ్రూప్ A మ్యాచ్లో మధ్యప్రదేశ్ జట్టు కర్ణాటకపై 160 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. కేవలం 23.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
Punjab vs Mumbai: సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్ వృధా.. ఉత్కంఠ పోరులో పంజాబ్ ఒక్క పరుగుతో విజయం..!
Also Read
- Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
- Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
- Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు 47.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌట్ అయింది. కర్ణాటక ఇన్నింగ్స్ లో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 49 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత దేవ్దత్ పడిక్కల్ 35 పరుగులు చేయగా, చివర్లో విద్యాధర్ పాటిల్ 34 పరుగులతో కొంత ప్రతిఘటన చూపించాడు. అయితే మధ్యప్రదేశ్ బౌలింగ్ లైనప్ దెబ్బకు కర్ణాటక బ్యాటర్లు నిలవలేకపోయారు.
మధ్యప్రదేశ్ తరఫున శివాంగ్ కుమార్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్ను పూర్తిగా తమ వైపుకు తిప్పేసాడు. 10 ఓవర్లలో 45 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు శివాంగ్. అతనికి తోడు కుమార్ కార్తికేయ, త్రిపురేష్ సింగ్, ఆర్యన్ పాండే లు చెరో వికెట్ తీసి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కర్ణాటక నిర్ణీత ఓవర్లు కూడా ఆడలేకపోయింది.
ఇక 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ బ్యాటింగ్ మొదటి నుంచే దూకుడుగా సాగింది. ఓపెనర్లు యశ్ దూబే (40), హిమాన్షు మంత్రి (34) పరుగులతో జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత కెప్టెన్ వెంకటేష్ అయ్యర్ కర్ణాటక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 33 బంతుల్లోనే 65 పరుగులు (4 ఫోర్లు, 5 సిక్సర్లు) సాధించించి మ్యాచ్ను వన్ సైడ్ గా మార్చేశాడు. అతనికి తోడుగా త్రిపురేష్ సింగ్ 12 బంతుల్లో 36 పరుగులతో అజేయంగా నిలవడంతో లక్ష్యాన్ని వేగంగా చేరుకుంది మధ్యప్రదేశ్ జట్టు. కేవలం 23.2 ఓవర్లలోనే 208/3 స్కోర్ చేసి 160 బంతులు మిగిలుండగానే ఘన విజయాన్ని అందుకుందింది. 5 వికెట్ల ప్రదర్శనకు గాను శివాంగ్ కుమార్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Madhya Pradesh win 👏
Venkatesh Iyer finishes it off in style 😎
They chase down 208 in 23.2 overs against Karnataka 👌
A commanding win in a crucial match 🔥
Scorecard ▶️ https://t.co/szHbOWqpZK#VijayHazareTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/9v4WdTXk03
— BCCI Domestic (@BCCIdomestic) January 8, 2026
SRH SCOUTING…!!!!
– Sunrisers Hyderabad got Shivang Kumar for just 30 Lakhs. 🤯pic.twitter.com/6mTv3cggwX
— Johns. (@CricCrazyJohns) January 8, 2026
తాజావార్తలు
-
Benjamin Netanyahu: అమెరికా అధ్యక్షుడితో విభేదాలు నిజమే.. ఓపెన్గా ఒప్పేసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని!
-
Astrology: మాట నిలబెట్టుకునే 4 రాశులవారు వీరేనా? ఒకసారి కమిట్ అయితే వెనక్కి తగ్గరట!
-
Trump warns Iran: హార్ముజ్ జలసంధి మూసేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
T20 World Cup : ఆస్ట్రేలియా కాదు, ఇంగ్లాండ్ కాదు.. ఇండియాని వణికిస్తున్న జట్టు ఇదే!
-
Vijay Birthday : రూ.70లక్షలు, 15 లారీలు.. విజయ్ జీవితాన్ని మలుపుతిప్పిన రోజు!
ట్రెండింగ్
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!