Karnataka Elections 2023: ఓట్లకు ఇంకా వారం టైం ఉంది.. కానీ ముందే ఓటేసిన తాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Elections 2023: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరుమీద ఉన్నాయి. ఎలగైనా అధికారం చేజిక్కించుకోవాలని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఎన్నికల సందర్భంలో కర్ణాటకలో అనేక వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా వారం రోజులు ఉండగానే ఓ శతాధిక వృద్ధుడు ఓటేశాడు. ఓవైపు ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుండగానే తాత ఓటెయ్యడం అక్కడ చర్చనీయాంశమైంది. అతడికి ఆ అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది.
Read Also: Nithish Kumar : సీఎం నితీష్కు షాక్.. బీహార్ కులగణనపై పాట్నా హైకోర్టు స్టే
Also Read
- RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
కరోనా మహమ్మారి దెబ్బతో ప్రపంచం మొత్తం తలకిందులైంది. అన్ని రంగాల్లోనూ మార్పులొచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణ విధానాల్లోనూ మార్పులను తీసుకొచ్చింది ఎన్నికల కమిషన్. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం మాదిరిగా కరోనాతో బాధపడుతున్నవారితో పాటు వృద్దులకు ‘వోట్ ఫ్రం హోం’ సదుపాయం కల్పించింది. అంటే కురువృద్ధులై ఉండి వారి వయసు 80 ఏళ్లు పైబడి.. పోలింగ్ బూత్ వరకు నడిచే పరిస్థితి లేని వారు ఇంటివద్దే ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది.
Read Also: DK Shiva kumar: శివ శివ.. నీకే ఎందుకిలా.. టైం బాగోలేనట్టుంది
కాకపోతే ఇంటినుండే ఓటు హక్కును వినియోగించుకుంటామని ముందుగానే ఈసీకి సమాచారం అందిచాలి. అప్పుడు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పోలింగ్ రోజుకంటే ముందే ఓటేయవచ్చన్న మాట. ఈసీ కల్పించిన ఆ అద్భుత అవకాశాన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓ శతాధిక వృద్దుడు ఉపయోగించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లాలోని చిక్కోడికి చెందిన మహాదేవ మహాలింగమాలి 103 ఏళ్ల వయసులోనూ ఓటేయాలనుకున్నాడు. వయసు రీత్యా పోలింగ్ బూత్ వరకు వెళ్లేందుకు తనకు శరీరం సహకరించదు. కాబట్టి ఇంటి నుండే ఓటేస్తానని ఈసీకి విన్నవించుకున్నాడు. దీంతో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆయన ఇంటికి వెళ్లి ఓటు వేయించారు. రహస్యంగా తనకు ఇష్టమైనవారికి ఆయన ఓటేయగా ఆ బ్యాలెట్ పేపర్ ను అధికారులు తీసుకున్నారు. అనంతరం ఓటేసినట్లు అతడి వేలికి సిరా అంటించారు. ఈ క్రమంలో ఇన్నేళ్ల వయసులోనూ ఓటేసిన మహాదేవను కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఫోన్ చేసి అభినందించారు. ఇక తనకు ఇంటివద్దే ఓటేసే అవకాశం కల్పించిన ఈసికి మహాదేవ మహాలింగ కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!