Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar Tragedy: కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని శంకరపట్నం మండలం పరిధిలో కేశవపట్నం గ్రామంలో తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని తోపుడు బండిపై తీసుకెళ్లిన దృశ్యం స్థానికులను కలచివేసింది. యాకూబ్ అనే యువకుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తండ్రి వీరయ్య అతడిని చెప్పులు కుట్టే దుకాణం దగ్గరికి తీసుకువచ్చి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా, మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు గ్రామ పంచాయతీకి సమాచారం ఇచ్చినా స్పందన లేకపోవడంతో నిరాశ చెందిన తండ్రి తన కుమారుడి శవాన్ని తోపుడు బండిపై ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. వరంగల్–కరీంనగర్ హైవే సమీపంలోనే ఇలాంటి ఘటన జరగడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. అత్యవసర సమయంలో కనీస సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, అధికార యంత్రాంగం స్పందించకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ప్రాథమిక సదుపాయాల కొరత కొనసాగుతోందనే విషయాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.
Also Read
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!