Emergency Movie: కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ విడుదలకు మార్గం సుగమం.. కొన్ని సీన్స్ కట్
- కంగనా రనౌత్ సినిమా 'ఎమర్జెన్సీ' విడుదలకు మార్గం సుగమం
- చిత్రంపై నిషేధం విధించడంపై బాంబే హైకోర్టులో మరోసారి విచారణ
- సినిమాలో కొన్ని కట్స్ చేయాల్సి ఉంటుందన్న సెన్సార్ బోర్డ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంగనా రనౌత్ సినిమా ‘ఎమర్జెన్సీ’ విడుదలపై నిషేధం విధించడంపై బాంబే హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఎమర్జెన్సీ చిత్రం విడుదలకు మార్గం సుగమం అయింది. ఈ చిత్రాన్ని విడుదల చేయవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తెలిపింది. అయితే.. సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీ సూచనల మేరకు సినిమాలో కొన్ని కట్స్ చేయాల్సి ఉంటుంది. జస్టిస్ బిపి కొలబావాలా, జస్టిస్ ఫిర్దౌస్ పోనివాలాలతో కూడిన ధర్మాసనం ముందు బోర్డు ఈ విషయాన్ని తెలిపింది. ఈ క్రమంలో.. చిత్రం విడుదలపై సోమవారం నాటికి ఈ విషయాన్ని పరిశీలిస్తామని చిత్ర నిర్మాత సంస్థ జీ స్టూడియోస్ చెబుతోంది.
Read Also: JC Prabhakar Reddy: గంజాయి అమ్మితే గ్రామ బహిష్కరణ.. జేసీ వార్నింగ్..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
జీ స్టూడియోస్ స్వయంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సెన్సార్ బోర్డ్ ద్వారా సర్టిఫికేట్ జారీ చేసేలా ఆదేశించాలని డిమాండ్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి సిక్కు సమాజాన్ని తప్పుగా చూపించారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత వివాదం ముదిరిపోవడంతో సెన్సార్ బోర్డు విడుదలను వాయిదా వేసింది. ఆగస్ట్ 29న ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు ముందు తమ దరఖాస్తును సమర్పించామని జీ స్టూడియోస్ కోర్టులో తెలిపింది. అయితే ఇప్పటి వరకు బోర్డు నుంచి సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు.
Read Also: Hydra Team: మూసీ నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్..
జబల్పూర్ సిక్కు సంగత్, ఇతర పార్టీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని.. ఆ తర్వాత సర్టిఫికేట్ జారీ చేయాలని సెప్టెంబర్ 4న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కు చెప్పామని గతంలో కోర్టు పేర్కొంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు.. కోర్టు సెప్టెంబర్ 25 లోగా నిర్ణయం తీసుకోవాలని బోర్డుని కోరింది, అయితే అప్పుడు కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు విడుదలకు సంబంధించి.. సూచించిన కట్స్ తర్వాత, సినిమాను థియేటర్లలో విడుదల చేయవచ్చని బోర్డు కోర్టులో తెలిపింది. ఈ చిత్రంలో కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఈ చిత్రానికి ప్రధాన అంశం 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..