Jurala Project : నిర్లక్ష్యంగా జూరాల ప్రాజెక్ట్.. తుప్పు పట్టిన గేట్లు, వృధా అవుతున్న నీరు
- జూరాల ప్రాజెక్ట్ నుంచి వాటర్ లీక్
- 12 క్రస్ట్ గేట్ల నుంచి లీక్ అవుతున్న నీరు
- 8 క్రస్ట్ గేట్ల రోప్ డ్యామేజ్
- మరమ్మతులు లేక, తుప్పు పట్టి ఊడిన గేట్ల రబ్బర్లు
- లీకేజీలతో వృధాగాపోతున్న నీరు, పట్టించుకోని అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jurala Project : తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల డ్యామ్ (Jurala Project) ప్రస్తుతం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతూ సమస్యలను ఎదుర్కొంటోంది. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదిలోని నీటిని అక్రమంగా తరలించుకుపోతుండగా, తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేయడంతో కృష్ణమ్మ దిగువకు వృధాగా పోతున్నది. జూరాల ప్రాజెక్టు గేట్లను సక్రమంగా నిర్వహించకపోవడంతో నీరు గేట్ల నుంచి లీకవుతూ ముప్పు మరింత పెరుగుతోంది.
తుప్పు పట్టిన గేట్లు, లీకైన నీరు
1995లో ప్రారంభమైన జూరాల ప్రాజెక్టు 9.68 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించబడింది. అయితే ప్రస్తుతం ప్రాజెక్టు గేట్లకు తుప్పు పట్టి, రబ్బర్లు ఊడిపోవడంతో మొత్తం 12 క్రస్ట్ గేట్ల నుంచి నీరు దిగువకు లీకవుతోంది. అందులో 8 గేట్ల రోప్లు దెబ్బతిన్నాయి. అధికారులు దీన్ని పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు భద్రతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
కర్నాటక వర్షాలు, తెలంగాణ నిర్లక్ష్యం
కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో జూరాల ప్రాజెక్టు జలాశయం నిండు కుండలా ఉంది. అయితే పాలకుల నిర్లక్ష్యం ఈ ప్రాజెక్టును వెంటాడుతోంది. గేట్లకు అమర్చిన రబ్బర్లను సకాలంలో మార్చకపోవడం, తుప్పుపట్టిన భాగాలను పునరుద్ధరించకపోవడం వల్ల ప్రాజెక్టు సామర్థ్యాన్ని కోల్పోతుంది. వేసవి కాలానికి ఇదే పరిస్థితి కొనసాగితే జూరాలపై ఆధారపడే ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
ప్రజల భవిష్యత్ పట్ల ఆందోళన
ఈ పరిస్థితుల మధ్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిని సక్రమంగా సంరక్షించకపోవడం వల్ల Telangana ప్రజలకు మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్రానికి భారీ నష్టం కలగనుంది. ప్రాజెక్టు నిర్వహణపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సమస్య పరిష్కారం కోసం చర్యల అవసరం
జూరాల ప్రాజెక్టు తక్షణమే మరమ్మతులకు గురవుతేనే వృధాగా పోతున్న నీటిని నిల్వచేసి నీటి కొరతను నివారించవచ్చు. ప్రభుత్వం, సంబంధిత శాఖలు ఈ సమస్యకు పరిష్కారం కనుగొనటానికి వేగంగా చర్యలు తీసుకోవాలి. ఇది జరిగితేనే ప్రాజెక్టు భద్రత కాపాడటమే కాకుండా ప్రజల అవసరాలకు తగిన నీటి సరఫరా కూడా పొందుపరచవచ్చు.
అయితే.. జూరాల గేట్ల లీకేజీలపై ఎస్ఈ రహీముద్దీన్ స్పందిస్తూ.. జూరాలలో మొత్తం 62 గేట్లు కాగా, వాటిలో 12 గేట్లలో లీకేజ్ అవుతున్నాయన్నారు. 12 గేట్లలో 25 క్యూసెక్కులు నీరు వృధా అవుతుందని తెలిపారు. ఈ లీకేజీ గత పది సంవత్సరాల నుండి కొనసాగుతుందని, ఈ గేట్ల మరమ్మతు కోసం గత నాలుగు సంవత్సరాల కిందట 11 కోట్ల 40 లక్షలతో స్వప్న కన్స్ట్రక్షన్ వారికి టెండర్ దక్కిందని ఆయన తెలిపారు. పోయిన సీజన్లో నాలుగు గేట్లు మరమ్మతులు పూర్తి చేశారని, సకాలంలో పనులు పూర్తి చేయునందుకు స్వప్న కన్స్ట్రక్షన్ కు నోటీసులు సైతం అందజేశామన్నారు. ఆనకట్ట భద్రతకు ఎలాంటి ముప్పు లేదని, ఈ సీజన్లో గేట్ల మరమ్మత్తులను పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.
Prabhas: మొదటి సారిగా అలాంటి పాత్రలో నటించబోతున్న ప్రభాస్ .. వర్కౌట్ అవుతుందా?
- Tags
తాజావార్తలు
-
Bihar Politics: ఆర్జేడీలో ఇంటిపోరు.. నాపై చర్య తీసుకోవాలని లాలూ కుమార్తె సవాల్..
-
Pregnancy: గర్భిణులకు “కాస్మెటిక్స్” ముప్పు.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
-
Anu Beniwal: శెభాష్ ఐపీఎస్.. రన్నింగ్తో సత్తా చాటిన 9 నెలల నిండు చూలాలి
-
Bandi Bhageerath :బండి భగీరథ్కు హైకోర్టు బెయిల్
-
KTR : కాంగ్రెస్ పని అయిపోయింది.. సర్వేల్లో బీఆర్ఎస్కు 78 సీట్లు ఖాయం
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!