Shayani Ekadashi : ఏకాదశి ప్రత్యేకత ఏంటి..? ఆ రోజు ఏమి చేయాలి..
- ఏకాదశి అంటేనే భక్తులకు ముందుగా గుర్తు వచ్చేది తొలి ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి మాత్రమే.
- చాలామందికి ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయని తెలియదు.
- ఆషాడ ఏకాదశి జూలై 17వ తేదీ తెల్లవారుజామున 3:18 గంటలకు మొదలై జూలై 18 తెల్లవారుజామున 2:42 గంటలకు సమాప్తం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shayani Ekadashi: ఏకాదశి అంటేనే భక్తులకు ముందుగా గుర్తు వచ్చేది తొలి ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి మాత్రమే. చాలామందికి ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయని తెలియదు. ప్రతి మాసంలో రెండుసార్లు ఏకాదశలు వస్తాయి. ఏ ఏకాదశి ప్రత్యేకత ఆ ఏకాదశిది. పక్షానికొక ఏకాదశి చొప్పున మాసానికి రెండు ఏకాదశలు.. సంవత్సరకాలంలో 24 ఏకాదశలు ఉంటాయి. వీటిలో హిందువులు ముఖ్యంగా నాలుగు ఏకాదశిలను విశేషంగా పరిగణిస్తారు. అదే ఆషాడ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి, కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి, పుష్య శుద్ధ ఏకాదశి, మాఘ శుద్ధ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి.
CM Revanth Reddy: కలెక్టర్లు ఎసీ గదులకే కాదు.. క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే..
Also Read
- Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
- Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
ఇకపోతే ఆషాడ ఏకాదశి జూలై 17వ తేదీ తెల్లవారుజామున 3:18 గంటలకు మొదలై జూలై 18 తెల్లవారుజామున 2:42 గంటలకు సమాప్తం అవుతుంది. ఆ రోజున భక్తులు మహావిష్ణువు ప్రార్థిస్తూ ఉపవాసం చేస్తారు. ఇకపోతే ఆషాడం మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి, మహా ఏకాదశి, దేవశయని ఏకాదశి అని పిలుస్తారు. దీనికి కారణం ఆ రోజు నుండే చాతుర్మాసం మొదలవుతుంది. ఆ రోజు నుంచి మహావిష్ణువు పాలసముద్రంలో నాలుగు నెలలపాటు విశ్రాంతి తీసుకుంటాడని భక్తులు నమ్ముతారు. ఈ కాలం చాలా శుభప్రదం అయినప్పటికీ.. శుభముహూర్తాలు ఉండవు. ఇక ఏకాదశి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదన్న విశేషాలు చూస్తే..
Kamal haasan : భారతీయుడు వచ్చాడు…కానీ ప్రేక్షకులే రావట్లేదు..ఎందుకని..?
* మహా విష్ణుకు తులసిదళం అంటే ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి ఆ రోజు మహావిష్ణువుకు తులసీదళాలని సమర్పించడం మర్చిపోవద్దు. అది లేకపోతే ఆరాధన అసంపూర్ణంగానే పరిగణిస్తారు.
* ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం చేస్తారు. అయితే ఉపవాసం లేనివారు తామసిక ఆహారం తినకూడదు. తామసిక ఆహారం అంటే.. సుగంధ ద్రవ్యాలు, మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్లు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు.
* ఏకాదశి రోజున వస్త్రాలు, అన్నం, నీరు, ధనం లాంటివి దానం చేయడం మంచిది. భక్తులు దీనిని చాలా పవిత్రంగా పరిగణిస్తారు.
* ఈ రోజున భక్తులు బ్రహ్మచర్యం కచ్చితంగా పాటించాలి. శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ప్రధమం.
* ఒకవేళ ఎవరైనా ఉపవాస దీక్ష లేకున్న ఆరోజు అన్నం తినకూడదు.
ఇక భక్తులు ఏకాదశి రోజున ఉపవాసం ఉండేటప్పుడు తేలకపాటి ఆహారం తీసుకోవాలి. అంతేకాదు, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా దేవుడిపై మనసుని కేంద్రీకృతం చేసేలా ఉంచుకోవాలి.
తాజావార్తలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
-
Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!