Shayani Ekadashi : ఏకాదశి ప్రత్యేకత ఏంటి..? ఆ రోజు ఏమి చేయాలి..
- ఏకాదశి అంటేనే భక్తులకు ముందుగా గుర్తు వచ్చేది తొలి ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి మాత్రమే.
- చాలామందికి ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయని తెలియదు.
- ఆషాడ ఏకాదశి జూలై 17వ తేదీ తెల్లవారుజామున 3:18 గంటలకు మొదలై జూలై 18 తెల్లవారుజామున 2:42 గంటలకు సమాప్తం.
Shayani Ekadashi: ఏకాదశి అంటేనే భక్తులకు ముందుగా గుర్తు వచ్చేది తొలి ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి మాత్రమే. చాలామందికి ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయని తెలియదు. ప్రతి మాసంలో రెండుసార్లు ఏకాదశలు వస్తాయి. ఏ ఏకాదశి ప్రత్యేకత ఆ ఏకాదశిది. పక్షానికొక ఏకాదశి చొప్పున మాసానికి రెండు ఏకాదశలు.. సంవత్సరకాలంలో 24 ఏకాదశలు ఉంటాయి. వీటిలో హిందువులు ముఖ్యంగా నాలుగు ఏకాదశిలను విశేషంగా పరిగణిస్తారు. అదే ఆషాడ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి, కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి, పుష్య శుద్ధ ఏకాదశి, మాఘ శుద్ధ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి.
CM Revanth Reddy: కలెక్టర్లు ఎసీ గదులకే కాదు.. క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఇకపోతే ఆషాడ ఏకాదశి జూలై 17వ తేదీ తెల్లవారుజామున 3:18 గంటలకు మొదలై జూలై 18 తెల్లవారుజామున 2:42 గంటలకు సమాప్తం అవుతుంది. ఆ రోజున భక్తులు మహావిష్ణువు ప్రార్థిస్తూ ఉపవాసం చేస్తారు. ఇకపోతే ఆషాడం మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి, మహా ఏకాదశి, దేవశయని ఏకాదశి అని పిలుస్తారు. దీనికి కారణం ఆ రోజు నుండే చాతుర్మాసం మొదలవుతుంది. ఆ రోజు నుంచి మహావిష్ణువు పాలసముద్రంలో నాలుగు నెలలపాటు విశ్రాంతి తీసుకుంటాడని భక్తులు నమ్ముతారు. ఈ కాలం చాలా శుభప్రదం అయినప్పటికీ.. శుభముహూర్తాలు ఉండవు. ఇక ఏకాదశి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదన్న విశేషాలు చూస్తే..
Kamal haasan : భారతీయుడు వచ్చాడు…కానీ ప్రేక్షకులే రావట్లేదు..ఎందుకని..?
* మహా విష్ణుకు తులసిదళం అంటే ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి ఆ రోజు మహావిష్ణువుకు తులసీదళాలని సమర్పించడం మర్చిపోవద్దు. అది లేకపోతే ఆరాధన అసంపూర్ణంగానే పరిగణిస్తారు.
* ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం చేస్తారు. అయితే ఉపవాసం లేనివారు తామసిక ఆహారం తినకూడదు. తామసిక ఆహారం అంటే.. సుగంధ ద్రవ్యాలు, మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్లు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు.
* ఏకాదశి రోజున వస్త్రాలు, అన్నం, నీరు, ధనం లాంటివి దానం చేయడం మంచిది. భక్తులు దీనిని చాలా పవిత్రంగా పరిగణిస్తారు.
* ఈ రోజున భక్తులు బ్రహ్మచర్యం కచ్చితంగా పాటించాలి. శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ప్రధమం.
* ఒకవేళ ఎవరైనా ఉపవాస దీక్ష లేకున్న ఆరోజు అన్నం తినకూడదు.
ఇక భక్తులు ఏకాదశి రోజున ఉపవాసం ఉండేటప్పుడు తేలకపాటి ఆహారం తీసుకోవాలి. అంతేకాదు, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా దేవుడిపై మనసుని కేంద్రీకృతం చేసేలా ఉంచుకోవాలి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!