Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత హాకీ జట్టు తన సత్తాను చాటుకుంది. భారత హాకీ జట్టు 1-0తో చైనాను ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆసియా ఛాంపియన్షిప్ 2024 ఫైనల్లో, నాల్గవ క్వార్టర్లో మొదటి గోల్ చేయడం ద్వారా భారత హాకీ జట్టు చైనాపై 1-0 ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో క్వార్టర్ 7వ నిమిషంలో జుగ్రాజ్ సింగ్ భారత్ తరఫున ఈ గోల్ చేశాడు. ఈ విధంగా మూడు క్వార్టర్ల తర్వాత ఒక గోల్ చేసి భారత్ ఫైనల్లో ముందంజ వేసింది.
Read Also: Bahirbhoomi: సింగర్ నోయల్ హీరోగా కొత్త సినిమా.. వింత టైటిల్
ఫైనల్ మ్యాచ్లో భారత్, చైనాల మధ్య మూడు క్వార్టర్ల పాటు టై అయినప్పటికీ, నాలుగో క్వార్టర్ 7వ నిమిషంలో జుగ్రాజ్ సింగ్ అద్భుతమైన పాస్ను గోల్గా మలిచి భారత్కు ఆధిక్యాన్ని అందించాడు. దీని తర్వాత నాలుగో క్వార్టర్ మిగిలి ఉన్న సమయంలో టీమిండియా ఆటగాళ్లు చైనాకు పునరాగమనానికి అవకాశం ఇవ్వలేదు. తద్వారా భారత హాకీ జట్టు ఐదోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. చైనాకు రజత పతకం దక్కనుంది. 2024 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.