తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. అందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చాలా సార్లు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.. ఇవాళ హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.. విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న నడ్డాకు.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్.. సహా మరికొందరు నేతలు స్వాగతం పలికారు.. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ సమీపంలోని నోవాటెల్ హోటల్కు వెళ్లారు నడ్డా.. అప్పటికే నోవాటెల్కు చేరుకున్న భారత క్రికెటర్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్.. జేపీ నడ్డాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
అయితే అనంతరం జేపీ నడ్డా హెలికాప్టర్లో వరంగల్కు బయలుదేరారు. అయితే.. వరంగల్కు చేరుకున్న జేపీ నడ్డా భద్రకాళి అమ్మవారిని బండి సంజయ్తో కలిసి దర్శించుకున్నారు. అయితే అనంతరం ఉద్యమకారుడు వెంకటనారాయణ ఇంటికి జేపీ నడ్డా వెళ్లనున్నారు. ఆ తరువాత బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే ఇప్పటికే భారీ బహిరంగ సభ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.