Gautam Gambhir: గంభీర్ పూర్తి పదవీకాలంలో ఉండటం కష్టమే.. భారత మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు!
- శ్రీలంక పర్యటనతో హెడ్ కోచ్గా బాధ్యతలు
- టీ20 సిరీస్ కైవసం
- నాకు ఎలాంటి ఈర్ష్య లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joginder Sharma on Gautam Gambhir: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ శ్రీలంక పర్యటనతో భారత హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. గంభీర్ మార్గనిర్ధేశంలో లంక పర్యటనలో టీ20 సిరీస్ను ఇప్పటికే సొంతం చేసుకున్న భారత జట్టు.. వన్డే సిరీస్పై కన్నేసింది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడితో మాట్లాడుతూ ప్రోత్సహిస్తున్న గంభీర్పై భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముక్కుసూటిగా మాట్లాడే గౌతీ పూర్తి పదవీకాలంలో కోచ్గా ఉండటం కష్టమే అని అభిప్రాయపడ్డాడు. అవతలి వ్యక్తిని పొగడ్తలతో బుట్టలో వేసేద్దామనే స్వభావి కాదన్నాడు.
శుభంకర్ మిశ్రా యూట్యూబ్ ఛానెల్లో జోగిందర్ శర్మ మాట్లాడుతూ… ‘భారత జట్టును నడిపిస్తున్న గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పదవిలో ఎక్కువ కాలం ఉండే అవకాశం చాలా తక్కువ. ఇలా అంటున్నానని అతడిపై వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ఈర్ష్య లేదు. గౌతీ సొంతంగా నిర్ణయాలు తీసుకొనే వ్యక్తి. ఒక్కోసారి జట్టులోని ఆటగాళ్ల అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చు. ఇక్కడ విరాట్ కోహ్లీ గురించి చెప్పడం లేదు. ఇతర ప్లేయర్స్ కూడా గంభీర్ నిర్ణయాలను ఇష్టపడకపోవచ్చు. గౌతీ ఏదైనా సరే నిర్మొహమాటంగా మాట్లాడేస్తాడు. అవతలి వ్యక్తిని పొగడ్తలతో బుట్టలో వేసేద్దామనే స్వభావి కాదు. ఏ పనినైనా నిబద్ధతతో చేస్తాడు. నిజాయతీ కలిగిన వ్యక్తి. అందుకే గౌతీ పూర్తికాలం హెడ్ కోచ్ పదవిలో ఉండకపోవచ్చు’ అని అన్నాడు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Also Read: Ambati Rayudu: ఏదీ అవసరం లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థనను తిరస్కరించిన అంబటి రాయుడు!
2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో చివరి ఓవర్ వేసి అందరి మదిలో నిలిచిపోయిన బౌలర్ జోగిందర్ శర్మ. టీ20 ప్రపంచకప్తో చాలా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత జట్టులో అవకాశాలు రాకపోవడంతో క్రమంగా ఆటకు దూరమయ్యాడు. జోగిందర్ భారత్ తరఫున 4 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. ప్రస్తుతం హరియాణా పోలీస్ శాఖలో డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!