JIO Offer: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం మరో సంచలన రీఛార్జ్ ప్లాన్ ను తీసుకవచ్చింది. ముఖ్యంగా టెక్నాలజీ ప్రియులు, డేటా ఎక్కువగా వాడే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ప్లాన్ వినియోగదారులను ఆకర్షించేలా ఉంది. కేవలం రూ. 339 లకే సరికొత్త క్యాలెండర్ మంత్ (31 రోజుల) ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా 28 రోజుల వాలిడిటీతో వచ్చే ప్లాన్లకు భిన్నంగా 31 రోజుల వాలిడిటీతో ఈ ప్లాన్ ను తీసుక వచ్చింది జియో.
Extramarital Affair: సంబంధానికి అడ్డు.. భర్తను గొంతు నులిమి కాల్చి చంపిన భార్య, ప్రియుడు!
ఈ ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..
రోజువారీ డేటా: ప్రతిరోజూ 1.5 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది.
అపరిమిత కాల్స్: ఏ నెట్వర్క్కైనా ఉచితంగా అపరిమిత వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.
ఎస్ఎంఎస్: రోజుకు 100 ఎస్ఎంఎస్ (SMS) లు ఉచితం.
టాక్ టైమ్: అదనంగా రూ. 14.95 విలువైన టాక్ టైమ్ బ్యాలెన్స్ కూడా ఖాతాలో జమ అవుతుంది.
ప్రత్యేక ఆఫర్లు: గూగుల్ జెమిని ప్రో, 5TB క్లౌడ్ స్టోరేజ్.
బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!
ఈ ప్లాన్లో భారీ ఆఫర్ ఏమిటంటే.. సుమారు రూ. 35,100 విలువైన ‘గూగుల్ జెమిని ప్రో’ (Google Gemini Pro) సబ్స్క్రిప్షన్ను వినియోగదారులు ఏకంగా 18 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. ఏఐ (AI) వినియోగం ఎక్కువైనా ఈ కాలంలో ఇది బెస్ట్ రీఛార్జిగా మారనుంది. దీనితో పాటు డేటాను సేవ్ చేసుకునేందుకు ఏకంగా 5000 GB (5TB) క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యాన్ని జియో కల్పిస్తోంది. దీనివల్ల మీ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను భద్రపరుచుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్తో పాటు, సరికొత్త నానో బనానా (Nano Banana) సేవలకు కూడా ఈ ప్లాన్ ద్వారా ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది.
