NTV Telugu Site icon

Jayashankar Bhupalpally: మహిళా కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడిన ఎస్ఐ..సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగింపు

New Project (15)

New Project (15)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ లోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఎస్సై భవాని సేన్ రాసలీలలు బయటపడుతున్నాయి. పోలీస్టేషన్ లో విధులు‌ నిర్వహిస్తున్న ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై ఎస్సై భవాని సేన్ వరుసగా హత్యాచారం చేసినట్లు వార్తలు సంచలనంగా మారాయి. ఆమెను తుపాకీతో బెదిరంచి అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్.ఐ భవాని సేన్ ను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐజీపీ ఏ. వి.రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై స్టేషన్ ఎస్.ఐ భవాని సేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూపాలపల్లి ఎస్పీ చేపట్టిన విచారణ చేపట్టారు. విచారణలో ఎస్. ఐ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిజ నిర్ధారణ అయ్యింది. దీంతోపాటు ఎస్.ఐ భవాని సేన్ గత 2022 జులై మాసంలో లైంగిక వేధింపులకు పాల్పడంతో ఇతనిపై ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తేలింది.

READ MORE: Minister Narayana: రాజధానిలో ఇళ్ల స్థలాల విషయం సుప్రీంకోర్టులో ఉంది..

సదరు ఎస్. ఐ తన హోదా అడ్డుపెట్టుకొని మరో ముగ్గురు మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల పై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. తరుచుగా లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడే వ్యవహారం తమ కీర్తి ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉందని పోలీస్ శాఖ నిర్ణయించుకుంది. కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ పై ఎలాంటి విచారణ లేకుండానే భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆర్టికల్ 311 ప్రకారం సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తునట్లుగా ఐజీపీ ఏ. వీ. రంగనాథ్ వెల్లడించారు.