Japan: చైనాకు చెక్ పెట్టిన ఇండియా ఫ్రెండ్.. డ్రాగన్ ఆట ముగిసినట్లే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japan: ప్రపంచ సాంకేతికత, ఆధునిక యుద్ధానికి పునాది అయిన అరుదైన భూమి లోహాలపై చైనా గుత్తాధిపత్యం కలిగి ఉంది. 2025లో చైనా విధించిన ఆంక్షల తరువాత ఇండియా స్నేహితుడు అయిన జపాన్ బీజింగ్కు చెక్ పెట్టింది. వాస్తవానికి ప్రపంచం ఇప్పటివరకు చైనాపై ఆధారపడిన విలువైన ఖనిజాలను వెలికితీసేందుకు జపాన్కు చెందిన ఒక భారీ నౌక బయలుదేరింది. దీంతో ఈ ఆటలో ఇకపై చైనా ఆట ముగిసినట్లే అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
రాయిటర్స్ నివేదికల ప్రకారం.. జపాన్ యొక్క పరీక్షా నౌక చిక్యూ, టోక్యో నుంచి దాదాపు 1,900 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినామిటోరి ద్వీపం వైపు వెళుతోంది. ఈ ఓడ యొక్క లక్ష్యం చాలా సంక్లిష్టమైనది. ఎందుకంటే ఇది మినామిటోరి ద్వీపం ప్రాంతంలోని సముద్ర ఉపరితలం నుంచి 6 కిలోమీటర్లు (4 మైళ్ళు) దిగువన డైవ్ చేయబోతుంది. ఈ సముద్రపు అడుగున ఉన్న బురదలో అరుదైన రేర్ఎర్త్ ఖనిజాల అపార నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఇంత లోతు నుంచి నిరంతరం బురదను వెలికితీసి విశ్లేషించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అవుతుందని చెబుతున్నారు. 130 మంది సిబ్బంది, పరిశోధకుల బృందంతో కూడిన ఈ నౌక ఈ మిషన్ను పూర్తి చేసి ఫిబ్రవరి 14 నాటికి తిరిగి వస్తుందని సమాచారం.
ఈ రోజు మనం ఉపయోగించే స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, జాతీయ భద్రత కోసం మోహరించిన క్షిపణి వ్యవస్థల సృష్టిలో అరుదైన ఈ రేర్ఎర్త్ ఖనిజాల కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటివరకు జపాన్, పాశ్చాత్య దేశాలు ఈ ఖనిజాల కోసం చైనాపై ఆధారపడ్డాయి. అయితే బీజింగ్తో కొనసాగుతున్న దౌత్య వివాదాల మధ్య, చైనా ఈ ముఖ్యమైన ఖనిజాల ఎగుమతిపై అనేక ఆంక్షలు విధించింది. చైనా నుంచి ఈ “బ్లాక్మెయిలింగ్”ను నివారించడానికి, జపాన్ ఇప్పుడు సరికొత్త అన్వేషణ వైపు అడుగులు వేస్తోంది. ఈ మిషన్ విజయవంతమైతే సాంకేతిక రంగంలో సరఫరాలపై చైనా ఆధిపత్యం అంతం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
పలు నివేదికల ప్రకారం.. జపాన్ ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలుగా దీని కోసం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న ఈ ప్రాజెక్టు అధిపతి షోయిచి ఇషి ఓడ ప్రారంభం అయినప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాడు. సముద్ర మట్టానికి 6 కిలోమీటర్ల దిగువన వనరులను వెలికితీయడం ఒక పెద్ద సాంకేతిక విజయం అని షోయిచి ఇషి చెప్పారు. ఈ విజయం జపాన్ వనరుల సేకరణ పద్ధతులను పూర్తిగా మారుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
READ ALSO: Sreeleela: ‘శ్రీలీల’ నీకే ఎందుకు ఇలా..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!