Janhvi kapoor: నటితో కలిసి చెన్నైలో గుడికెళ్లిన జాన్వీ కపూర్.. శ్రీదేవి ఫేవరెట్ ప్లేస్ అంటూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi kapoor Visited Sridevi’s Favourite Temple: నటిగా భారతదేశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండే అతి తక్కువ మంది నటీమణులలో శ్రీదేవి ఒకరు. ఆమె అనూహ్య మరణం పలువురిని కలచివేసింది. నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతుండగా, నిన్న చెన్నైలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు చిత్ర కథానాయకుడు రాజ్కుమార్రావు, జాన్వీ కపూర్లు హాజరయ్యారు. వీరిద్దరూ షారుక్ ఖాన్ కోల్కతా జట్టుకు మద్దతుగా నిలిచారు. ఆట ముగిసే సమయానికి కోల్కతా IPL 2024 ట్రోఫీని గెలుచుకుంది. దాని వేడుకలు పూర్తయ్యాయి.
Shah Rukh Khan: షారుఖ్ వాచ్ ధరతో హైదరాబాద్లో లగ్జరీ విల్లా కొనచ్చు తెలుసా?
Also Read
- IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
- Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
- PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
- TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
ఇక ఇదిలా ఉండగా నటి జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో చెన్నైలోని ప్రసిద్ధ ముప్పట్టమ్మన్ ఆలయాన్ని సందర్శించిన ఫోటోను షేర్ చేసింది. జాన్వీ కపూర్తో పాటు ఆ ఆలయానికి ప్రముఖ నటి మహేశ్వరి కూడా వెళ్లింది. నటి మహేశ్వరి నటి జాన్వీ కపూర్కు సోదరి వరుస అవడం గమనార్హం. దేవర: పార్ట్ 1తో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దేవర చిత్రం యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో తొలి పాటను విడుదల చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే రెండో పాట విడుదల కానుంది. ఇందులో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తరువాత ఆమె బుచ్చిబాబు సినిమాలో కూడా నటిస్తోంది.
తాజావార్తలు
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
-
World’s First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
-
PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!