RC16 Shooting : రామ్ చరణ్, జాన్వీల ‘RC16’ షూటింగ్ అప్పటి నుంచేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RC16 Shooting : అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ ఇప్పటికీ హిందీలో పలు సినిమాలు చేసింది. అందులో ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు స్టార్ హోదా తీసుకురాలేకపోయాయి. కాబట్టి తెలుగులో లక్ పరిశీలించుకోవాలని ప్రయత్నాలు చేసి ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో ఒక లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అయితే దేవర ఫస్ట్ పార్టులో ఎక్కువసేపు ఆమె కనిపించలేదని కంప్లైంట్స్ ఉన్నాయి. కనిపించింది కొంచెం సేపు అయినా ఆమె హీరోయిన్ లాగా అనిపించలేదని రకరకాల కామెంట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమె అభిమానులు స్థిమితపడేలా ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. అదేంటంటే ఆమె రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రాంచరణ్ 16వ సినిమాలో కూడా నటిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Read Also:Astrology: నవంబర్ 5, మంగళవారం దినఫలాలు
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ మైసూర్ లో నవంబర్ 22నుంచి జరగబోతోంది. తర్వాత హైదరాబాద్ నగరానికి షిఫ్ట్ కాబోతోంది. ఇక రామ్ చరణ్ ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి తన బాడీ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. టీం కూడా ఇప్పటికే మిగతా నటీనటులను అందరినీ ఫైనలైజ్ చేశారు. అయితే సెకండ్ హీరోయిన్ గా మరొక బాలీవుడ్ హీరోయిన్ ని దింపే ప్రణాళికలు ఉన్నాయని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో కేవలం ఒకే హీరోయిన్ మాత్రమే ఉంటుందని అది కూడా జాన్వీ కపూర్ మాత్రమేనని తెలుస్తోంది.
Read Also:Actress Kasturi : తెలుగు రాజకీయాల్లోకి నటి కస్తూరి.. ఏ పార్టీ అంటే..?
ఈ సినిమాలో మరే ఇతర హీరోయిన్లు ఉండబోరు అని తెలుస్తోంది. ఒకరకంగా ఇది జాన్వీ కపూర్ కు మాత్రమే కాదు ఆమె అభిమానులకు కూడా ఓ శుభవార్త లాంటిదే అనుకోవచ్చు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారట. ఈ సినిమా ఇంటర్వెల్ లోనే చరణ్ రెండో పాత్ర రివీల్ అవుతుందని.. సినిమా మొత్తానికే ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తుందట. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాకి నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. అన్నట్టు యానిమల్ సినిమాతో విలన్ గా ఫామ్ లోకి వచ్చిన బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..