NTV Telugu Site icon

J-K: ఆలయాలు కడితే కాల్చేస్తాం.. హిందువులను చంపేస్తాం.. జమ్మూ ముస్లిం హెచ్చరిక (వీడియో)

J K News

J K News

జమ్మూకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు దశల ఓటింగ్ అనంతరం అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇంతలో ‘ది రాజధర్మ’ రిపోర్టర్ అర్చన తివారీ గ్రౌండ్‌కి వెళ్లి అక్కడి ఓటర్ల మనసులను విచారించే ప్రయత్నం చేశారు. కానీ.. రిపోర్టింగ్ సమయంలో ఆమె ఓ వ్యక్తి మాటలకు విస్తుపోయారు. ఉత్తర కశ్మీర్‌లోని లోలాబ్‌లో ఓటర్లతో మాట్లాడేందుకు వచ్చిన అర్చన తివారీ.. ముస్తాక్ అనే ముస్లిం వ్యక్తితో ఎన్నికల గురించి చర్చించారు. మొదట ముస్తాక్ తాను ఇంజనీర్ రషీద్‌కు మద్దతుదారునని, తన ప్రాంతంలో డ్యామ్, ప్లే గ్రౌండ్, చౌకగా విద్యుత్తు కావాలని చెబుతున్నట్లు అనిపించింది.

READ MORE: Bhumana Karunakar Reddy: తప్పు చేస్తే నేను, నా కుటుంబం సర్వనాశనం అవుతుంది..

మస్తాక్ మాట్లాడుతూ.. బీజేపీ మా మతానికి విరుద్ధం, మతం (ముస్లిం) ప్రకారం పని చేయనందున మా ప్రాంతంలో గెలవలేదు. బీజేపీ మజీద్ ముందు గుడి నిర్మించింది. బియ్యాన్ని ఖరీదు చేసింది. మేము ముస్లింలం. మేము అల్లాను ప్రార్థిస్తాం. మేము నమాజ్ చేస్తాం. గుడిలో పూజలు చూడటం వల్ల ముస్లింలకు సమస్యలు వస్తాయి.” అని పేర్కొన్నారు.

READ MORE:Pawan Kalyan: ఏపీలో చేపట్టిన బదిలీలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష

ఇది విన్న అర్చన తివారీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హిందువులకు ముస్లింలతో ఎప్పుడూ సమస్యలు ఉండవని అన్నారు. దీనిపై ముస్తాక్ మాట్లాడుతూ.. “మీకు ఎలాంటి సమస్య ఉండదు. కానీ మేము ముస్లింలమైనందున మాకు సమస్య ఉంది. హిందువులు ఎవరైనా వచ్చి ఇక్కడ బహిరంగంగా మద్యం సేవించినా.. పని కోసం మా గ్రామానికి వచ్చిన వారిని చంపేస్తాం.” అని వ్యాఖ్యానించాడు.

READ MORE:Jani Master Case : జానీ మాస్టర్‌ కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్‌

గ్రామంలో గుడి కట్టడం ఎంతమాత్రం సరైంది కాదని ముస్తాక్ తన డిమాండ్లన్నింటినీ చెప్పాడు. ఎవరైనా వచ్చి గుడి కట్టిస్తే తాము తగులబెడతామని హెచ్చరించాడు. దీనిపై అర్చన తివారీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. “మీకు ఈ విషయాలు ఎవరు నేర్పించారు? అని ప్రశ్నించారు. దీనిపై ముష్తాక్ “నేను అల్లా మీద ప్రమాణం చేస్తున్నను. నాకు ఈ విషయాలు ఎవరూ నేర్పలేదు. నేను నా స్వంతగా చెబుతున్నాను.” అని సమాధానమిచ్చాడు.

READ MORE: Rahul Gandhi: మోడీ “మన్‌ కీ బాత్‌” వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరు..

తమ ప్రాంతంలో గుడి కట్టేందుకు తమ భూమిని హిందువులకు ఇవ్వబోమని ముస్తాక్ అన్నాడు. “ఈ భూమి మోడీకి చెందినది కాదు. ఇది మాది. మేము నమాజ్ చేస్తాము. తాను ఖురాన్‌లో దేవాలయాలను తగలబెట్టే అంశాన్ని చదవలేదు. నేను ముస్లిం అయినందున ఇవన్నీ నాకు తెలుసు. ఇక్కడ గుడి కట్టి హిందూ పూజ లేదా భజన చేస్తే అస్సలు మాకు అస్సలు ఇష్టం ఉండదు.” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.