Jammu & Kashmir Cloudburst: జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్.. 33 మందికి పైగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu & Kashmir Cloudburst: జమ్మూ కాశ్మీర్లోని చాషోటి ప్రాంతంలో గురువారం క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వరదల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద స్థలం నుంచి యాత్రికులను ఖాళీ చేయిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. చాషోటి మచైల్ మాతా యాత్రకు ప్రారంభ స్థలం, కిష్త్వార్లోని హిమాలయ మాతా చండి మందిరానికి వెళ్లే మార్గంలో ఈ వరదలు సంభవించినట్లు తెలిసింది. ఈ ఆకస్మిక వరదల్లో 33 మందికి పైగా చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం.
READ MORE: Sanju Samson: సంజు శాంసన్.. వర్కౌట్ కాదు! యాష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
సహాయక చర్యలను ముమ్మరం చేయాలి..
చషోతి కిష్త్వార్లో కుంభవృష్టితో సంభవించిన ఆకస్మిక వరదల విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. విషయం తెలిసిన వెంటనే తీవ్ర వేదనకు గురైనట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వరదల్లో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రమాద స్థలంలో రక్షణ, సహాయ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని, బాధితులకు సాధ్యమైన అన్ని సహాయాలు అందించాలని పౌర, పోలీసు, సైన్యం, NDRF, SDRF అధికారులను ఆదేశించారు.
ఘటనపై జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్ ఎంపీ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. భారీ స్థాయిలో తుఫాను సంభవించడంతో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం ఏర్పడే అవకాశం ఉందన్నారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. అధికారులు కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. ఇప్పటికే వారు ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు. వైద్య చికిత్స కోసం హెలి-రెస్క్యూ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అతి త్వరలో మరిన్ని వివరాలు తెలుస్తామన్నారు.
ఘటనపై డిప్యూటీ కమిషనర్ కిష్త్వార్ పంకజ్ శర్మ స్పందించారు. మచైల్ మాతా యాత్ర ప్రారంభ స్థానం అయిన కిష్త్వార్లోని చషోటి ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయన్నారు. ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?