టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హనుమాన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా రాబోతున్న ‘జై హనుమాన్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు (ఫిబ్రవరి 22) ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ పూజా కార్యక్రమం కర్ణాటకలోని హంపి సమీపంలో ఉన్న అంజనాద్రి బెట్టలో ఘనంగా జరిగింది.
Also Read : Kalki 2 : ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..‘కల్కి 2’ షూటింగ్ షురూ!
ఈ పూజా కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మతో పాటు, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి, యువ నటుడు తేజ సజ్జా ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సీక్వెల్లో హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి నటించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు రాగా, నేడు ఆయన స్వయంగా పూజలో పాల్గొనడంతో ఆ వార్తలు నిజమయ్యాయి. మొదటి భాగంలో హీరోగా నటించిన తేజ సజ్జా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అంజనాద్రి బెట్టను హనుమంతుడి జన్మస్థలంగా భావిస్తారు, అందుకే అక్కడే ఈ సినిమాను ప్రారంభించడం విశేషం. ఈ సీక్వెల్లో గ్రాఫిక్స్, కథాంశం మొదటి భాగం కంటే పదిరెట్లు భారీగా ఉండబోతున్నాయని ప్రశాంత్ వర్మ ఇప్పటికే హింట్ ఇచ్చారు. హనుమంతుడు శ్రీరాముడికి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నాడు అనే పాయింట్తో ఈ సినిమా సాగనుందని సమాచారం.
