NTV Telugu Site icon

Jagga Reddy : చంద్రబాబు.. నితీష్ తో మోడీ మూడోసారి ప్రధాని అయ్యారు

Jagga Reddy

Jagga Reddy

చంద్రబాబు.. నితీష్ తో మోడీ మూడోసారి ప్రధాని అయ్యారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 400 సీట్లు గెలుస్తాం అని చెప్పిన మోడీకి మూడోసారి ప్రధాని అయ్యిన ఆనందం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు అపాయింట్ మెంట్ అడిగితే కూడా ఇవ్వని మోడీ.. చంద్రబాబు బలంతో ప్రధాని అయ్యారని జగ్గారెడ్డి విమర్శించారు. పవన్ కల్యాణ్‌ని ముందు పెట్టి… టీడీపీ ని కలుపుకుని బీజేపీ గేమ్ ఆడిందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని అయ్యాడు అంటే టీడీపీ..నితీష్ పుణ్యమే అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కుటుంబం ది త్యాగాల చరిత్ర..మోసాల చరిత్ర బీజేపీ ది.. మోడీ ది అని, శివుడి పటం తో పార్లమెంట్ కి రాహుల్ గాంధీ వచ్చాడు.. మోడీ ఎప్పుడైనా రాముడి చిత్రపటం తెచ్చాడా అని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ మీద ఏం మాట్లాడాలో తెలియక పిల్ల చేష్టలు అంటున్నాడు మోడీ అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు మోడీ మైండ్ బ్లాంక్ అయ్యిందని, రాహుల్ గాంధీ వయసు గురించి మాట్లాడుతున్న మోడీ కి కాంగ్రెస్ వయసంత లేదన్నారు. బీజేపీ కి కూడా కాంగ్రెస్ కి ఉన్నంత వయసు లేదన్నారు జగ్గారెడ్డి.