Jagapathi Babu: జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రం విడుదలైన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వాతావరణం ఉందో అందరికీ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆ తరుణంలో ఒక సీనియర్ హీరో ‘జై బోలో తెలంగాణ’ చిత్రంలో నటించాలనే సంచలన నిర్ణయం తీసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆనాటి అనుభవాలను, ఎదురైన సవాళ్లను జగపతి బాబు పంచుకున్నారు.
READ ALSO: Maa Inti Bangaram: థియేటర్లలో సమంత రచ్చ అప్పుడే! ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ వచ్చేసింది..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ సినిమా షూటింగ్ కోసం వరంగల్ వెళ్లాల్సి వచ్చినప్పుడు పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉండేవని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన తండ్రి ఫోన్ చేసి.. “వద్దురా.. ఇప్పుడు అక్కడ షూటింగ్ చేయడం కరెక్ట్ కాదు, నాకు భయంగా ఉంది, తిరిగి వచ్చేయ్” అని వారించారని చెప్పారు. కానీ, ప్రజలు తనను అంతగా హర్ట్ చేస్తారని తాను అనుకోలేదని, అందుకే మొండిగా ముందుకు వెళ్లానని వివరించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో త్రెట్స్ (బెదిరింపులు) రాకపోయినప్పటికీ, ఆంధ్రాలో ఉన్న తన అభిమానులు, ప్రజలు మాత్రం కొంత బాధపడ్డారని ఆయన తెలిపారు. “మనవాడు వెళ్లి అక్కడ ఆ సినిమా చేశాడేంటి?” అని తిట్టుకున్న వారు కూడా ఉన్నారని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే, షూటింగ్ సమయంలో ముందు జాగ్రత్తగా తన వద్ద ఒక వెపన్ (గన్) ఉంచుకున్నట్లు ఆయన వెల్లడించారు. “నా దగ్గర గన్ ఉండేది, కానీ వేల మంది తిరగబడితే ఆ ఒక్క గన్ ఏం చేయగలదు?” అని ఆయన ఆనాటి ఉద్విగ్న పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. వరంగల్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు భయాందోళనలు ఉన్నప్పటికీ, అక్కడి ప్రజలు తనను ఎంతో గౌరవంగా చూసుకున్నారని జగపతి బాబు గుర్తు చేసుకున్నారు.
READ ALSO: Indian Stock Market: 5 రోజుల్లో రూ.63 వేల కోట్లు సంపాదించారు.. ఎలాగో తెలుసా?
