ITC Fined Rs 1 Lakh: బిస్కెట్ ప్యాకెట్లో ఒక బిస్కెట్ తక్కువ ఉందని.. రూ. లక్ష జరిమానా విధించిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ITC Fined Rs 1 Lakh: సాధారణంగా బిస్కెట్ ప్యాకెట్ కొన్నప్పుడు ఎవరైనా ఎన్ని బిస్కెట్లు ఉంటాయో.. ఎంత బరువు ఉందో అని గమనిస్తారా?. చాలా మంది అయితే లేదు అనే సమాధానం ఇస్తారు. కానీ ఓ వినియోగదారుడు మాత్రం తాను కొనుగోలు చేసిన బిస్కెట్ ప్యాకెట్ను మొత్తం గమనించాడు. దీంతో రేపర్పై రాసిన బిస్కెట్ల సంఖ్య ప్రకారం ప్యాకెట్లో ఉన్న బిస్కెట్లలో ఒకటి తక్కువగా ఉందని ఏకంగా ఆ బిస్కెట్ ప్యాకెట్ తయారుచేసిన కంపెనీపై ఎఫ్ఎంసీజీ కోర్టులో కేసు పెట్టాడు. దీంతో ఈ కేసును విచారించిన వినియోగదారుల ఫోరం కోర్టు కంపెనీకి రూ.లక్ష జరిమానా విధించింది.
చెన్నైలోని ఎంఎండీఏ మాథుర్ ప్రాంతానికి చెందిన పి.ఢిల్లీబాబు అనే వ్యక్తి 2021, డిసెంబర్ నెలలో స్థానికంగా ఉండే ఓ రిటైల్ షాప్ నుంచి రెండు ప్యాకెట్ల సన్ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్లను కొనుగోలు చేశాడు. అయితే ఒక ప్యాకెట్లో 16 బిస్కెట్లకు బదులు 15 బిస్కెట్లు మాత్రమే కనిపించాయి. తనను ఎందుకు మోసం చేశారంటూ షాపు యజమానిని ప్రశ్నించాడు. అతడి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఐటీసీ లిమిటెడ్ను మెయిల్ ద్వారా సంప్రదించాడు. అక్కడి నుంచి కూడా వినియోగదారుడికి సరైన సమాధానం రాలేదు. దీంతో ఏకంగా వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసును విచారించిన వినియోగదారుల ఫోరం కోర్టు కంపెనీకి రూ. లక్ష జరిమానా విధించింది.
Also Read
Also Read: Madhya Pradesh: ప్రేమికులని భావించి అన్నాచెల్లెలుపై దాడి.. రక్షాబంధన్ రోజు ఘటన
ఒక్కో బిస్కెట్ ధర 75 పైసలు అంటూ ఢిల్లీబాబు వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఐటీసీ రోజుకు 50 లక్షల బిస్కెట్ల ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తుందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ లెక్కల ప్రకారం ప్రతిరోజు రూ.29 లక్షల మేర వినియోగదారులను ఆ సంస్థ మోసం చేస్తోందని కోర్టుకు విన్నవించారు. దీనిపై ఐటీసీ వాదిస్తూ.. బిస్కెట్లను సంఖ్య ఆధారంగా కాకుండా బరువు ఆధారంగా విక్రయిస్తున్నారని వాదించింది. సన్ఫీస్ట్ మేరీ లైట్ ప్రతి ప్యాకెట్పై నికర బరువు 76 గ్రాములుగా గుర్తించబడింది. అయితే, 15 బిస్కెట్లు ఉన్న ఒక్కో ప్యాక్ 74 గ్రాముల బరువు మాత్రమేనని కోర్టు గుర్తించింది. అస్థిర ఉత్పత్తుల విషయంలో మాత్రమే అటువంటి మినహాయింపు చెల్లుబాటు అవుతుందని ఐటీసీ వివరణను కోర్టు తిరస్కరించింది. ఈ నియమం బిస్కెట్లకు వర్తించదు. ఫోరం కంపెనీకి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ బిస్కెట్ల బ్యాచ్ అమ్మకాలను నిలిపివేసింది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!